10/07/2014, భువనేశ్వర్, ఒడిసా: భజరంగ్ దళ్ రెండు రోజుల జాతీయ స్థాయి సమావేశాలు ఒడిసా రాష్ట్రము లోని భువనేశ్వర్ లో నిన్న ప్రారంభమయ్యాయి, తేది : 09/07/2014 మరియు 10/07/2014 ల పాటుగా జరగనున్నాయి, దేశంలోని అన్ని రాష్ట్రల రాష్ట్ర స్థాయి ముఖ్య నాయకులందరూ ఈ సమావేశాలకు హాజరయ్యి దేశంలో హిందూ ధర్మం పై జరుగుతున్న దాడులు, గో-రక్షా , దేవాలయాల సంరక్షణ తదితర అంశాల పై చర్చ జరిగింది. మన ప్రాంతం నుండి శ్రీ సుభాష్ చందర్ గారు ఈ సమావేశాలకు హాజరయ్యారు.
భజరంగ్ దళ్ జాతీయ సంయోజకులు శ్రీ రాజేష్ పాండే గారు గత సంవత్సరం జరిగిన కార్యక్రామాల పై సమీక్ష నిర్వహించడం జరిగింది, ఈ సంవత్సరం జరిగిన విశ్వ హిందూ పరిషద్ స్వర్ణ జయంతి లక్ష్యాలను నిర్దేశించుకోవడం జరిగింది.



No comments:
Post a Comment