Our amazing new site will launch in

Tuesday, 15 July 2014

జాగృత హిందూ ప్రతీక - ఆచార్య గిరిరాజ్ కిషోర్ - ఒక పరిచయం

రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ ప్రచారక్‌ అయిన ఆచార్య గిరిరాజ్‌ కిశోర్‌ గారు 13-7-2014 నాడు ఢిల్లీలోని విశ్వహిందూ పరిషత్‌ కార్యాలయంలో బ్రహ్మౖెెక్యం చెందారు. వారి వయస్స 96 సంవత్సరాలు. చిన్న తనం నుండే రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘంలో చేరి అంచెలంచలుగా పైకిి ఎదగి, ప్రచారక్‌గా పూర్తి సమయాన్ని, సర్వశక్తి యుక్తులను సమాజానికి అంకితం చేశారు. విశ్వహిందూ పరిషత్‌ 1983లో చేపట్డిన ఏకాత్మతా యాత్రా సందర్భంగా వారు, మాన్యశ్రీ అశోక్‌ సింఘాల్‌ గారితో కలిసి పరిషత్‌కు అంకితమయ్యారు. పరిషత్‌ ఉద్యమాలలో వివిధ స్థాయిలలో బాధ్యతలు నిర్వహించారు. ముఖ్యంగా శ్రీరామ జన్మభూమి ఆందోళనలో వారిపాత్ర అద్వితీయమైనది. విద్యార్థి పరిషత్‌లోను, భారతీయ జనసంఘంలో కూడా వీరి సేవలను వివిధ సందర్భాలలో అందించారు


అయోధ్యలో భవ్య శ్రీరామ మందిర నిర్మాణమే ఆచార్యp గిరిరాజ్ కిషోర్ జి కి అసలైన నివాళి : విహెచ్పి నేత తొగాడియ

నేడు విశ్వ హిందూ పరిషద్ మరియు సమస్త హిందూ సమాజం తన పెద్ద దిక్కును కోల్పోయింది, శ్రీ రామ జన్మ భూమి లో భవ్య రామ మందిర నిర్మాణమే ' ఆచార్య గిరిరాజ్ కిషోర్ జి కి నిజమైన నివాళి- ప్రవీణ్ భాయి తొగాడియా




15/07/2014, సంకట్ మోచన్ హనుమాన్ ఆశ్రమం, సెక్టార్ - 6, క్రొత్త డిల్లి : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మొదటి తరం ప్రచారక్ మరియు విశ్వ హిందూ పరిషద్ స్థాపన, నిర్మాణంలో నిరంతర కృషి చేసిన హిందూ రాష్ట్ర స్వాప్నికుడు, హిందూ దేశ ఆత్మ గౌరవ చిహ్నం అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మానోద్యమ నేత స్వర్గీయ ఆచార్య గిరిరాజ్ కిషోర్ గారి భౌతిక దేహం తేది : 14/07/2014 ణ రోజు సందర్శకుల సౌకర్యార్థం విశ్వ హిందూ పరిషద్ కేంద్రీయ కార్యాలయంలో ఉంచడం జరిగింది.
ప్రవీణ్ భాయి తొగాడియా
ఈ సందర్భంలో విశ్వ హిందూ పరిషద్ అంతర్జాతీయ కార్యధ్యక్షులు మాన్య శ్రీ ప్రవీణ్ భాయి తొగాడియా గారు తన సంతాప సందేశాన్ని తెలియజేస్తూ " ఆచార్య గిరిరాజ్ కిషోర్ జి మృతి తీవ్ర దిగ్బ్రాంతి కలిగించింది, నేడు విశ్వ హిందూ పరిషద్ మరియు సమస్త హిందూ సమాజం తన పెద్ద దిక్కును కోల్పోయింది, శ్రీ రామ జన్మ భూమి లో భవ్య రామ మందిర నిర్మాణమే ' ఆచార్య గిరిరాజ్ కిషోర్ జి కి నిజమైన నివాళి ' - ఆ నిజమైన నివాళి ఇవ్వడానికి హిందూ సమాజం సిద్దమవ్వాలి " అని అన్నారు.  

Monday, 14 July 2014

కర్నూల్ : ప్రతి మహిళా ఒక జిజాబాయి కావాలి - విహిప ప్రాంత మహిళా ప్రముఖ్ శ్రీమతి వరలక్ష్మి

14/07/2014, కర్నూల్ : విశ్వ హిందూ పరిషద్ మహిళా విభాగం మాతృమండలి ప్రముఖుల జిల్లా స్థాయి సమావేశం తేది : 13/07/2014 నాడు స్థానిక విశ్వ హిందూ పరిషద్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జరిగింది, ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా సుమారు 50 మంది మాతృమండలి ప్రముఖులు హాజరయ్యారు.
ప్రసంగిస్తున్న శ్రీమతి వరలక్ష్మి గారు
1000 సంవత్సరాల విధర్మియ దాడుల తర్వాత కూడా ఈ దేశాన్ని నిలబెట్టిన అదృశ్య శక్తి 'అమ్మ' : శ్రీ మతి వరలక్ష్మి  
ఈ కార్యక్రమానికి ముఖ్య అథితి హాజరయిన విశ్వ హిందూ పరిషద్ పశ్చిమాంధ్ర ప్రాంత మాతృమండలి ప్రముఖ్ శ్రీ మతి  వరలక్ష్మి గారు మార్గ దర్శనం చేస్తూ " విహిప స్వర్ణ జయంతి సంవత్సరం రాబోతున్నది దేశ వ్యాప్తంగా హిందూ సంఘటన కార్యం క్రొత్త వేగాలు అందుకుంటున్నది ఆకాశంలో సగమైన మనం, దేశ సేవలోను అగ్రేసరులుగా ఉందాం, అనేక దురాక్రమణభరిత దండయాత్రలు, బౌతిక భౌద్ధిక దాడులు, మెడపై ఎల్లప్పుడూ వేలాడిన విధర్మియ పాలన అయిన ఈ దేశపు ఆత్మ చావలేదు, అందుకే ప్రపంచ దేశాలు వెతుకుతున్నాయి ఈ దేశన్ని నిలబెట్టిన ఆత్మ కోసం, ఆ ఆత్మ, ఆ అంతరంగిక శక్తి " అమ్మా " , ప్రపంచంలో అనేక దేశాలు ఒకే ఒక దండయాత్ర తో మటుమాయం అయ్యాయి, అనేక మతాలూ ఒకే ఒక్క దెబ్బతో మటుమాయం అయ్యాయి, కాని నాదేశం నిలబడింది " జిజాబాయి " లాంటి అమ్మల వలన, కాబట్టి మన మందరు ఆ పౌరుష చరిత్రకు చారిత్రిక వారసులం, మన జీవన క్రమంలో కూడా ఆ సుగుణాలను అలవరుచుకుందాం, మనం మన పిల్లలను ' వీర శివాజిలు'గా మారుద్దాం , మనల్ని మనం జిజాబాయి లుగా మర్చుకుందాం ' అని అన్నారు.
హాజరయిన మాతృమండలి ప్రముఖులు 
ఈ కార్యక్రమంలో ప్రాంత ఉపాధ్యక్షులు శ్రీ వ్యాసరాజ్ గారు, ప్రాంత సంఘటన మంత్రి శ్రీ కేశవరాజు గారు, విభాగ్, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. 

ఆచార్య గిరిరాజ్ కిషోర్ మృతి హిందూ సమాజానికి తీరని లోటు : శ్రీ రామరాజు (విహిప ప్రాంత అధ్యక్షులు )

14/07/2014, విజయ శ్రీ భవనం, కోఠి, భాగ్యనగర్ : విశ్వ హిందూ పరిషద్ జేష్ట్య నాయకులు అనేక సంవత్సరాలు ప్రధాన కార్యదర్శిగా, ఉపాధ్యక్షులుగా వ్యవహరించిన పూజ్య శ్రీ ఆచార్య గిరిరాజ్ కిషోర్ గారు విశ్వ హిందూ పరిషద్ కేంద్ర కార్యాలయం, సంకట్ మోచన్ హనుమాన్ ఆశ్రమం, సెక్టార్ - 6 , డిల్లి లో  13/07/2014 (  నిన్న ) నాడు పరపదించడం జరిగింది.

విశ్వ హిందూ పరిషద్ పశ్చిమాంద్ర ప్రాంత కార్యాలయం విజయ శ్రీ భవనం లో వారికి ఆత్మకు శాంతి కలగాలని ఘన నివాళి అర్పించడం జరిగింది, ఈ కార్యక్రమంలో ప్రాంత అధ్యక్షులు శ్రీ రామరాజు గారు, ప్రాంత కార్యధ్యక్షులు శ్రీ సురేందర్ రెడ్డి గారు, ప్రాంత ఉపాధ్యక్షులు శ్రీ గోల దుర్గయ్య గారు, ప్రాంత కార్యదర్శి శ్రీ గాళ్ రెడ్డి గారు, సంఘటన మంత్రి శ్రీ కేశవ రాజు గారు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

ఆచార్య గిరిరాజ్ కిషోర్ జి మృతి హిందూ సమాజానికి తీరని లోటు : శ్రీ రామరాజు 

ఆచార్య గిరిరాజ్ కిషోర్ జి మృతి హిందూ సమాజానికి తీరని లోటు, హిందూ సమాజ సంఘటన కార్యం లో తన 93 వ ఏట కూడా చూపిన ఉత్సాహం మన అందరికి స్పూర్తి దాకయం, వారి జీవనమే సగటు కార్యకర్తకు దిక్సూచి గా పని చేస్తుంది, వారి ఆత్మకు శాంతి కలిగించాలని ఆ భగవంతుడిని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను.

శ్రీ రామ జన్మ భూమి ఉద్యమాన్ని తన భుజ స్కంధాల పై మోశారు : శ్రీ గాళ్ రెడ్డి 

ఆచార్య గిరిరాజ్ కిషోర్ లేని శ్రీ రామ జన్మభూమి ఉద్యమాన్ని ఉహించడమే కష్టం, అంతలా తనే ఉద్యమమై ఉద్యమమే తానై శ్రీ రాముని సేవలో తరించిన ధన్యజీవి, వారి ఆత్మకు శాంతి కలిగించాలని ఆ భగవంతుడిని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. 
  

Thursday, 10 July 2014

భువనేశ్వర్ : ప్రారంభమైన 2-రోజుల భజరంగ్ దళ్ జాతీయ స్థాయి సమావేశాలు

10/07/2014, భువనేశ్వర్, ఒడిసా: భజరంగ్ దళ్ రెండు రోజుల జాతీయ స్థాయి సమావేశాలు ఒడిసా రాష్ట్రము లోని భువనేశ్వర్ లో నిన్న ప్రారంభమయ్యాయి, తేది : 09/07/2014 మరియు 10/07/2014 ల పాటుగా జరగనున్నాయి, దేశంలోని అన్ని రాష్ట్రల రాష్ట్ర స్థాయి ముఖ్య నాయకులందరూ ఈ సమావేశాలకు హాజరయ్యి దేశంలో హిందూ ధర్మం పై జరుగుతున్న దాడులు, గో-రక్షా , దేవాలయాల సంరక్షణ తదితర అంశాల పై చర్చ జరిగింది. మన ప్రాంతం నుండి శ్రీ సుభాష్ చందర్ గారు ఈ సమావేశాలకు హాజరయ్యారు.
భజరంగ్ దళ్ జాతీయ సంయోజకులు శ్రీ రాజేష్ పాండే గారు గత సంవత్సరం జరిగిన కార్యక్రామాల పై సమీక్ష నిర్వహించడం జరిగింది, ఈ సంవత్సరం జరిగిన విశ్వ హిందూ పరిషద్ స్వర్ణ జయంతి లక్ష్యాలను నిర్దేశించుకోవడం జరిగింది. 

Tuesday, 8 July 2014

అన్య మతాలకు ప్రాధాన్యత ఇస్తూ - బోనాలపై నిర్లక్ష్యమా ? : విశ్వ హిందు పరిషద్

08/07/2014, విజయశ్రీ భవనం, భాగ్యనగర్ : " తెలంగాణా బోనాలు " పండుగను ' రాష్ట్ర ప్రభుత్వ పండుగగా ' ఆర్భాటంగా ప్రకటించిన తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఆ హామీల అమలులో మాత్రం తీవ్ర నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించిందని విశ్వ హిందు పరిషద్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది.

స్థానిక విశ్వ హిందు పరిషద్ రాష్ట్ర కార్యాలయం లో పరిషద్ రాష్ట్ర సంఘటన మంత్రి శ్రీ ఆకారపు కేశవ్ రాజు గారు మాట్లాడుతూ ' ఆర్భాటంగా బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ రూపాయలు 20 లక్షలు మంజూరు చేసామని హామీ ఇచ్చిన  తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం తన హామీ నిలబెట్టుకోవడంలో తీవ్ర నిర్లక్ష్య వైఖరిని చూపింది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్ననాను, ప్రకటించిన 20 లక్షలలో చిల్లి గవ్వ కూడా విడుదల చేయకుండా హిందు సమాజాన్ని మోసం చేసింది రాష్ట్ర ప్రభుత్వం పై  విశ్వ హిందు పరిషద్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది, ఇదే సమయంలో అన్య మతస్తుల ప్రార్థనాలయాల అభివృద్ధికి పది కోట్ల రూపాయలు విడుదల చేయడం గర్హనీయం, ఇలాంటి విషయాలు పునరావృతం అయితే హిందు సమాజం తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాను ' అని అన్నారు     

విశ్వ హిందూ పరిషద్ సేవ పని విభాగము - సూచనా పత్రము

విశ్వహిందూ పరిషత్‌ 1964 ఆవిర్భవించబడి నేటికి 50 సంవత్సరములు పూర్తి అయిన సందర్భంగా 2014 ఆగష్టు 17వ తేది గోకులాష్టమి నుండి 2015 సెప్టెంబరు 5వ తేది గోకులాష్టమి వరకు దేశవ్యాప్తంగా సర్ణజయంతి ఉత్సవాలు నిర్వహించబడుతున్నవి. అందులో భాగంగానే పరిషత్‌ సేవా విభాగ్‌ ఈ క్రింద ఉదాహరించబడిన కార్యక్రమాలను నిర్వహించాలని సంకల్పించింది. 
కేంద్రం 2014 ఫిబ్రవరి 22, 23 తేదీలలో రాయపురం బైఠక్‌లో మరియు 2014 జూన్‌ 15వ తేది భాగ్యనగరంలో క్షేత్రబైఠక్‌ నిర్వహించబడింది. అందులో తీసుకున్న ఈ క్రింది సూచనలు గమనించగలరు. 

1. క్షేత్రస్థాయిలో సేవాకార్యక్రమాలను రెట్టింపుచేయాలి. అందుకు సేవా కార్యక్రమాలు నిర్వహించబడుతున్న జిల్లాలు మినహా, మిగతా జిల్లాలలో సేవాప్రకల్పాలను ప్రారంభం చేయాలి. 
2. సేవావిభాగ్‌ ఆధ్వర్యములో భాగ్యనగరంలో పెద్దఎత్తున సాంస్కృత కార్యక్రమాలు నిర్వహించాలి. 
3. ప్రతి బాలకళ్యాణ ఆశ్రమమునుండి ఒక మంచి సాంస్కృత కార్యక్రమము ఏర్పాటు చేయాలి. 
4. ఆశ్రమ విద్యార్తులకు ఇప్పటినుండే శిక్షణను ఇవ్వాలి. 
5, పూర్వవిద్యార్థులు కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొనునట్లు చూడాలి. 
6. మనజిల్లాళి ఉన్న మిగతా ట్రస్టులను గుర్తించి వాటి చిరునామాలను సేకరించాలి. 
7. జిల్లా స్వాగత సమితికి ప్రతిష్టితుల పేర్లను సేకరించాలి. 
8. మన ఆశ్రమములో మనము నిర్వహించే కార్యక్రమాల సి.డి. తయారు చేయాలి. 
9. దాని సహాయముతో ప్రాంతస్థాయిలో కంబైండు సి.డి ని తయారు చేయవచ్చును. 
10. కంబైండు ఫోల్డరు తయారు చేయడానికి ప్రయత్నం జరుగుతున్నది. 
11. కేంద్రసూచన ప్రకారము ప్రాంతంలో ఒక నిర్వహణ సమితివేయాలి. అందుకు మీ మీ జిల్లాలనుండి తగిన పేర్లను సేకరించి పంపగలరు. 
12. మనకు కావలసిన ధనసేకరణ చేసుకోవాలి. 
13. ప్రాంతనిధి రూ.3000/- పంపాలి. 
14. అలాగే మీ ఆశ్రమముయొక్క ఆడిట్‌ నివ దిక పంపాలి. 
15. సర్ణజయంతి కార్యక్రమాలు విజయవంతము చేయడానికి మీ మీ సలహాలు, అభిప్రాయాలు తెలియజేయగలరు. 
16. సేవా విభాగ్‌ కార్యక్రమాల సక్రియ నిర్వహనకు, ప్రాంతస్థాయిలో ఒక పూర్తి సమయ కార్యకర్త అవసరము. కార్కర్తకు రూ.7000/- లు ఖర్చు అవుతుంది. ఈ విషయములో మీ సమితి ఆలోచించి అభిప్రాయాలను ప్రాంతానికి త్వరలో తెలియజేయగలరని మనవి. 

భవదీయ

Sunday, 6 July 2014

హైదరాబాద్ : ఒకే కంటేనర్ లో 117 ఆవులను కుక్కి తరలించిన వైనం - అడ్డుకున్న భజరంగ్ దళ్

  • మనవ హృదయం గగ్గురుపోడిచే సంఘటన
  • మదిలో ఏ కొంచం అయిన జాలి ఉన్న మనిషికైనా కన్నీరు పెట్టించే దృశ్యం
  • ఒకే లారి కంటేనర్ లో 117 ఆవులను ఆమనవీయంగా క్రుక్కి కబెలాలకు తరలించిన వైనం 
  • అడ్డుకున్న భజరంగ్ దళ్ 
  • స్థానిక బేరం గూడ గోశాలకు తరలింపు 

పటాన్ చేరు, హైదరాబాద్ 07/07/2014 : హైదరాబాద్ పరిసరాలలో ఆవుల పట్ల జరుగుతున్న ఆమానవీయ హత్యాఖండా రోజుకొకటి బయటకి వస్తూనే ఉంది, ఇదే నేపథ్యంలో తేది : 06/07/2014 నాడు భాగ్యనగర్ సమీపంలోని పటాన్ చేరు ప్రాంత్రంలో ఒకే లారి కంటేనర్ లో 117 ఆవులను దారుణంగా క్రుక్కి కబెలాలకు అక్రమంగా రవాణ చేస్తున్న లారీని స్థానిక భజరంగ్ దళ్ - విశ్వ హిందూ పరిషద్ కార్యకర్తలు అడ్డుకున్నారు.
లారీని తెరిచి చూస్తె గుండె తరుక్కు పోయే దృశ్యాలు కళ్ళముందు కదలాడాయి, కనీసం అవులకు నిలబడెంత స్థలం కూడా లేదు ఆన్ని ఆవుల కాళ్ళు మడిచి కట్టి దారునాతి దారుణంగా అక్రమ రవాణ చేయడం మనస్సును ద్రవింపజేసే దృశ్యమే. వెంటనే భజరంగ్ దళ్ కార్యకర్తలు స్పందించి తక్షణ వైద్య సహాయాన్ని అందించి స్థానిక బీరం గూడ గో-శాలకు తరలించడం జరిగింది.




ముగిసిన విహిప ప్రాంత వర్షరంభ సమావేశాలు - స్వర్ణోత్సవాల నిర్వహణకు పిలుపు

07/07/2014, సంగారెడ్డి : విశ్వ హిందూ పరిషద్ పశ్చిమాంద్ర ప్రాంత స్థాయి వర్షారంభ సమావేశాలు తేది : 05/07/2014 నుండి 06/07/2014 వరకు రెండు రోజుల పాటుగా సంగారెడ్డి లో జరిగినాయి, పరిషద్ ఈ సంవత్సరం తన స్వర్ణ జయంతిని జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ సమావేశాలను వేడుకగా జరపాలని బావించిన స్థానిక విశ్వ హిందూ పరిషద్ నాయకత్వం తగిన ఏర్పాటు చేయడం జరిగింది.

భారత మాత పునర్వైభవ ప్రాప్తికి ఇదే సరైన సమయం : శ్రీ రాఘవరెడ్డి గారు

సమావేశాల తోలి రోజైన 05/07/2014 నాడు విశ్వ హిందూ పరిషద్ అంతర్జాతీయ అధ్యక్షులు శ్రీ రాఘవ రెడ్డి గారు ప్రత్యేక అతిధిగా హాజరయ్యి


కార్యకర్తలకు మార్గదర్శనం చేసారు. ఈ సందర్భంలో వారు మార్గదర్శనం చేస్తూ " విశ్వ హిందూ పరిషద్ ఈ సంవత్సరం తో తన 50 ఏళ్ల ప్రస్తానాన్ని పూర్తీ చేసుకోబోతున్నది, గతంలో చేసిన పని ఒక ఎత్తు ఈ సంవత్సరం చేయాల్సిన పని ఒక ఎత్తు, పరిషద్ స్వర్ణ జయంతి సంవత్సరం జరుపుకుంటున్న సమయంలో మన ధర్మ జాగృతి పనిలో ఉండడం మన పూర్వ జన్మ సుకృతం, దేశంలో దాదాపు 90 కోట్ల హిందువులు ఉన్న ఈ దైవియ కార్యం కోసం ఆ భగవంతుడు మనల్ని ఎంచుకోవడంలోనే ఆ అంతరార్ధం దాగి ఉంది, ఈ అంశాన్ని మనం గమనించాలి, ఆ భగవంతుడు మన పై విశ్వాసం తో మన ముందు ఉంచిన లక్ష్యాన్ని కార్యదీక్షతో పూర్తీ చేసి ఆ భగవంతుని విశ్వాసాన్ని నిలబెట్టాలి, దేశంలో ఒక బృహత్తర మార్పు రాబోతున్నది, తిరిగి భారత మాత తన పరవ వైభవ స్థానంలో ఉండి విశ్వ గురువుగా ప్రపంచానికి మార్గ దర్శనం చేయబోతున్నది ఈ మార్పుకు మనమే వారధులం కావాలి, ఆ మార్పునకు ప్రత్యక్ష సాక్షులం కావాలి, మన కన్నులతో దేశ పునర్వైభవం చూడాలి, దాని కోసం దేశంలో ప్రతి గ్రామంలో విశ్వ హిందూ పరిషద్ జెండా ఎగరాలి, హిందుత్వం కోసం పరితపించే కార్యకర్తలను ప్రతి గ్రామంలోను నిర్మాణం చేయాలి, హిందూ సమాజం నేడు మన వైపు ఆశగా, అనేక ఆకాంక్షలతో చూస్తూ ఉంది, పరిషద్ తో కలసి పనిచేయడానికి హిందూ యువకులు పెద్ద ఎత్తున ఆసక్తి కనబరుస్తున్నారు, మన పని కేవలం ఆయువ శక్తి మార్గదర్శనం చేయడమే ఈ లక్ష్య సాధన దిశలో మన మందరం కలిసి ఉద్యమ స్పూర్తితో పనిచేయాల్సిన అవసరం ఉంది." అని అన్నారు.

పదం పదం కదం కదం కలిపి మహోద్యమం  నిర్మిద్దాం : శ్రీ సురేందర్ రెడ్డి గారు

విశ్వ హిందూ పరిషద్ పశ్చిమాంధ్ర ప్రాంత కార్యదక్షులు శ్రీ సురేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ " దేశంలోని అన్ని ప్రాంతాలు విశ్వ హిందూ పరిషద్ స్వర్ణ జయంతి ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాయి, ఈ క్రమంలో అనేక లక్ష్యాలు నిర్ణయించుకున్నాయి, మనం కూడా మన ప్రాంతంలోని ప్రతి ఉప మండల స్థాయిలో పూర్తీ స్థాయి విశ్వ హిందూ పరిషద్ సమితిలను నిర్మించాలి, ప్రతి గ్రామ స్థాయిలో ఎదో ఒక మార్గంలో పరిషద్ పని ప్రారంభం కావాలి " అని అన్నారు. 

ఈ సమావేశాలలో పరిషద్ కేంద్రీయ సహా కార్యదర్శి శ్రీ సత్యం జి, ప్రాంత అధ్యక్షులు శ్రీ రామరాజు గారు, ప్రాంత కార్యదర్శి శ్రీ గాళ్ రెడ్డి గారు, ప్రాంత ఉపాధ్యక్షులు శ్రీ దుర్గయ్య గారు, సహా కార్యదర్శి శ్రీ వ్యసరాజ్ గారు, సంఘటన మంత్రి శ్రీ కేశవ్ రాజు గారు, లతో పాటు గా అనేక మంది క్షేత్ర మరియు ప్రాంత స్థాయి అధికారులు రెండు రోజులపాటు సమావేశాలలో ఉంది మార్గదర్శనం చేయడం జరిగింది.           

విశ్వ హిందు - Jul - 2014

(or)
Download as pdf format





About Me

Powered by Blogger.

Blog Archive

Contact us

Name

Email *

Message *

Top Ad unit 728 × 90

Disqus Shortname

Comments system

Ad Inside Post

వార్తా - హైందవం

News

Contact Form

Name

Email *

Message *

Purchasing Code

Home PageNav

PageNav Posts Number

Scroll Animation

Boxed Style