విశ్వహిందూ పరిషత్ 1964 ఆవిర్భవించబడి నేటికి 50 సంవత్సరములు పూర్తి అయిన సందర్భంగా 2014 ఆగష్టు 17వ తేది గోకులాష్టమి నుండి 2015 సెప్టెంబరు 5వ తేది గోకులాష్టమి వరకు దేశవ్యాప్తంగా సర్ణజయంతి ఉత్సవాలు నిర్వహించబడుతున్నవి. అందులో భాగంగానే పరిషత్ సేవా విభాగ్ ఈ క్రింద ఉదాహరించబడిన కార్యక్రమాలను నిర్వహించాలని సంకల్పించింది.
కేంద్రం 2014 ఫిబ్రవరి 22, 23 తేదీలలో రాయపురం బైఠక్లో మరియు 2014 జూన్ 15వ తేది భాగ్యనగరంలో క్షేత్రబైఠక్ నిర్వహించబడింది. అందులో తీసుకున్న ఈ క్రింది సూచనలు గమనించగలరు.
1. క్షేత్రస్థాయిలో సేవాకార్యక్రమాలను రెట్టింపుచేయాలి. అందుకు సేవా కార్యక్రమాలు నిర్వహించబడుతున్న జిల్లాలు మినహా, మిగతా జిల్లాలలో సేవాప్రకల్పాలను ప్రారంభం చేయాలి.
2. సేవావిభాగ్ ఆధ్వర్యములో భాగ్యనగరంలో పెద్దఎత్తున సాంస్కృత కార్యక్రమాలు నిర్వహించాలి.
3. ప్రతి బాలకళ్యాణ ఆశ్రమమునుండి ఒక మంచి సాంస్కృత కార్యక్రమము ఏర్పాటు చేయాలి.
4. ఆశ్రమ విద్యార్తులకు ఇప్పటినుండే శిక్షణను ఇవ్వాలి.
5, పూర్వవిద్యార్థులు కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొనునట్లు చూడాలి.
6. మనజిల్లాళి ఉన్న మిగతా ట్రస్టులను గుర్తించి వాటి చిరునామాలను సేకరించాలి.
7. జిల్లా స్వాగత సమితికి ప్రతిష్టితుల పేర్లను సేకరించాలి.
8. మన ఆశ్రమములో మనము నిర్వహించే కార్యక్రమాల సి.డి. తయారు చేయాలి.
9. దాని సహాయముతో ప్రాంతస్థాయిలో కంబైండు సి.డి ని తయారు చేయవచ్చును.
10. కంబైండు ఫోల్డరు తయారు చేయడానికి ప్రయత్నం జరుగుతున్నది.
11. కేంద్రసూచన ప్రకారము ప్రాంతంలో ఒక నిర్వహణ సమితివేయాలి. అందుకు మీ మీ జిల్లాలనుండి తగిన పేర్లను సేకరించి పంపగలరు.
12. మనకు కావలసిన ధనసేకరణ చేసుకోవాలి.
13. ప్రాంతనిధి రూ.3000/- పంపాలి.
14. అలాగే మీ ఆశ్రమముయొక్క ఆడిట్ నివ దిక పంపాలి.
15. సర్ణజయంతి కార్యక్రమాలు విజయవంతము చేయడానికి మీ మీ సలహాలు, అభిప్రాయాలు తెలియజేయగలరు.
16. సేవా విభాగ్ కార్యక్రమాల సక్రియ నిర్వహనకు, ప్రాంతస్థాయిలో ఒక పూర్తి సమయ కార్యకర్త అవసరము. కార్కర్తకు రూ.7000/- లు ఖర్చు అవుతుంది. ఈ విషయములో మీ సమితి ఆలోచించి అభిప్రాయాలను ప్రాంతానికి త్వరలో తెలియజేయగలరని మనవి.
భవదీయ