Our amazing new site will launch in

Tuesday, 31 December 2013

సూరత్ : ప్రారంభమైన విశ్వ హిందూ పరిషద్ అంతర్జాతీయ పాలక మండలి సమావేశాలు


  • వచ్చే ఎన్నికల్లో ఎ పార్టి ప్రభుత్వం వచ్చిన అయోధ్య లో శ్రీ రామ మందిరం నిర్మిచాల్సిందే - ప్రవీణ్ తొగాడియ 
  • స్వర్ణోత్సవాల సందర్భంలో దేశ వ్యాప్తంగా లక్ష యాభై వేల గ్రామాలో పరిషత్ సమితుల నిర్మాణానికి నిర్ణయం 

సూరత్ , గుజరాత్ 31/12/2013 : విశ్వ హిందూ పరిషద్ లో అత్యున్నత నిర్ణాయక మండలి అయిన  అంతర్జాతీయ పాలక మండలి ఐదు రోజుల పాటు నిర్వహించే సమావేశాలు తేది 31/12/2013 న గుజరాత్ రాష్ట్రము లోని సూరత్ నగరం లో ప్రాపంభమయ్యాయి.  ప్రముఖ భాగవత ప్రవచనకారులు పూజ్య శ్రీ రమేష్ భాయి ఓజా మరియు స్వామి నారాయణ మందిరం యొక్క సంతు శ్రీ నౌతం జి మహారాజ్, మాన్య శ్రీ ప్రవీణ్ భాయి తొగాడియా గార్ల దివ్య జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ఉద్గాటన జరిగింది .
ప్రస్తుత ప్రభుత్వం హిందూ ఆధ్యాత్మిక వేత్తలు , సాధు సంతులు లను లక్ష్యంగా చేసుకుని మైనారిటి సంతుస్టికరణ చేసి తద్వారా ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుంది - పూజ్య రమేష్ భాయి ఓజా 
సాధువుల అశిః ప్రసంగం అనంతరం మాన్య శ్రీ ప్రవీణ్ భాయి తొగాడియ మార్గదర్శం చేస్తూ ' నేడు దేశం లో ఏ హిందువు సురక్షితంగా లేదు , అనునిత్యం దేశంలో లోని ఎదో ఒక చోట హిందువుల పై దాడులు జరిగుతూనే ఉన్నాయి , ముజఫర్ నగర్ లాంటి సంఘటనలు సర్వ సాధారణం అయ్యాయి , కాశ్మీర్ అస్సాం లాంటి హిందూ జనాభా తక్కువగా ఉన్న ప్రాంతాలలో పరిస్థితి మరీ విషమంగా ఉంది , ఈ దేశంలో హిందువుల రక్షణ విషయంలో ఎవ్వరూ మాట్లాడటం లేదు. వచ్చే విశ్వ హిందూ పరిషద్ స్వర్ణోత్సవ ఉత్సవాలలో దేశం లోని లక్ష యాభై వేల గ్రామాలలో విశ్వ హిందూ పరిషద్ , భజరంగ్ దళ్ , దుర్గావహిని సమితులను ఏర్పాటు చేసి తద్వారా ఈ జాతి వ్యతిరేక శక్తులకు గట్టి సమాదానం చెప్పాల్సి ఉంది ఆ దిశలో మనమందరం కలసి పనిచేద్దాం అని ఆశిస్తున్నాను ' అని అన్నారు.



ఈ సమావేశాలలో విశ్వ హిందూ పరిషద్ కార్యధ్యక్షులు ( విదేశీ విభాగం ) మాయ శ్రీ అశోక్ రావు చంగ్లె , విహిప అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి మాన్య శ్రీ చంపత రాయ్ లతో పాటు పరిషత్ పదాదికారులు హాజరయ్యారు .

Saturday, 14 December 2013

సూర్యాపేట్ లో తిరిగి హిందుత్వంలోకి వచ్చిన 68 కుటుంబాల నుండి 221 మంది

సూర్యాపెట్ , నల్గొండ , 13/12/2013 : నల్గొండ జిల్లా సూర్యాపేట్ లోని అంబేద్కర్ నగర్ రామాలయం లో జరిగిన పునరాగమణ కార్యక్రమమం లో చుట్టు ప్రక్కల 7 గ్రామాలకు చెందిన 68 కుటుంబాల నుండి 221 మంది మతం మారిన హిందువులు తిరిగి హిందూదర్మం లోకి వచ్చారు, వారందరికీ శ్రీ రాముని చిత్ర పటాలు, నూతన వస్త్రాలు అందించబడ్డాయి. 

మాన్య శ్రీ గుమ్ముల సత్యం విశ్వ హిందూ పరిషద్ కేంద్రీయ సహా కార్యదర్శి గారు మాట్లాడుతూ ' జాతి ప్రధాన జీవన స్రవంతి నుండి ప్రలోభాలకు లోనై మతం మారినవారందరూ తిరిగి హిందుత్వంలోనికి రావడం శుభపరిణామం, హిందూ దర్మం చిర పురాతనం - నిత్య నూతనం అందుకే దీనిని సనాతన దర్మం అని అన్నారు , హిందుత్వంలో లేనిది ప్రపంచంలోని ఏ మతంలోనూ లేదు, అన్ని మతాలకు ధర్మాలకు జననిలాంటిది హిందుత్వం, నదులు ఎక్కడ పుట్టినా , ఎక్కడెక్కడ తిరిగినా అవి చివరికి ఆ సముద్రాన్నే చేరుతాయి అని ప్రభోదించిన హిందుత్వం ద్వారానే ప్రపంచ శాంతి సాధ్యమౌతుంది, తమ తల్లిని వీడిన మన సహోదరులందరినీ తిరిగి తమ మాతృ వోడిలోకిని తీసుకురావలసిన బాధ్యత మన అందరిది ' అని అన్నారు .

ఈ కార్యక్రమంలో శ్రీ పాల్శర్మ గారు , శ్రీ ఎల్లయ్య గారు , శ్రీ BS మూర్తి గారు గ్రామ పెద్దలు పాల్గొన్నారు 

Thursday, 5 December 2013

Ram Madhav’s book: COMMUNAL VIOLENCE BILL : THREAT TO NATIONAL INTEGRATION

A reposting:
RSS Akhil Bharatiya Sah Sampark Pramukh Sri Ram Madhav’s book on COMMUNAL VIOLENCE BILL: THREAT TO NATIONAL INTEGRATION, SOCIAL HARMONY AND CONSTITUTIONAL FEDERALISM
Find the e-book by clicking this link.
RM

హిందు వ్యతిరేకమైన మత హింస నిరోద బిల్లు పై దేశ వ్యాప్త ఉద్యమం : ప్రవీణ్ భాయి తొగాడియ

దేశం లోని మెజారిటి హిందువుల కు వ్యతిరేకంగా ఉన్న మత హింస నిరోధ బిల్లును విశ్వ హిందు పరిషత్ వ్యతిరేకిస్తుంది , ఈ బిల్లుకు వ్యతిరేకంగా దేశ వ్యాప్త ఉద్యమం నిర్వహిస్తాం - ప్రవీణ్ భాయి తొగాడియ 
ప్రవీణ్ భాయి తొగాడియ 
కొత్త డిల్లి : హిందువుల రాజ్యాంగపర మౌలిక హక్కులను కాలరాసేదిగా ఉన్న మత హింస నిరోద బిల్లును విశ్వ హిందు పరిషద్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ,దేశం లోని మైనారిటిల హక్కులనును రక్షించే ముసుగులో ఈ బిల్లు హిందువుల మౌలిక హక్కులను కాలరాసేదిగా ఉంది , కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ బిల్లు ప్రతిపాదనను వెనక్కు తీసుకోవాలి లేని యెడల  దేశ వ్యాప్తంగా తీవ్ర ఉద్యమం నిర్వహిస్తామని విశ్వ హిందు పరిషద్ అంతర్జాతీయ కార్యద్యక్షులు మాన్య శ్రీ ప్రవ్చీన్ భాయి తొగాడియా ప్రకటించారు .

బిల్లు ఎందుకు హిందూ వ్యతిరేకం : 

  1. బిల్లులో మెజారిటి అయిన హిందువులను నేరస్తులుగా , మైనారిటిలను బాదితులుగా చూపెట్టబడింది, ఇది సహజ న్యాయసూత్రాలకు వ్యతిరేకం ఈ కారణం గా దేశం లోని హిందువుల పై మత హింస చెలరేగిన సందర్భంలో దాడులు జరిగిన కనీసం మెజారిటి హిందువుల వాని వినిపించుకునే నాధుడే ఉండడు.
  2. అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం చట్టం అందరికి సమాన రక్షణ కలిగించాలి కాని ఈ బిల్లు మత హింస చెలరేగిన సందర్భంలో  కేవలం ముస్లీంలకు మాత్రమె రక్షణ కలిగించేలా ఉంది.
  3. భారత దేశ న్యాయ సూత్రాల ప్రకారం ముద్దాయి న్యాయస్థానం లో నేర నిరూపణ జరిగే వరకుకూడా ముద్దయిగానే పరిగణించబడాలి, కాని ఈ బిల్లులో హిందువులు ఆరోపణ జరిగిన వెంటనే నేరస్తులుగా పరిగనించబడతారు , నాన్ - బెయిలబుల్ కేసులు మోపబడతాయి .
  4. నేరారోపణ జరిగిన వ్యక్తికీ తను ఆ నేరం చేయలేదని నిరూపించుకునే హక్కు ఉంది, కాని ఈ బిల్లు కారణంగా మత హింస చెలరేగిన సందర్భంలో  హిందువులు ఆ ప్రాధమిక హక్కును కోల్పోతారు.
  5. ఈ బిల్లు ద్వారా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా పొలిసు యంత్రాంగాన్ని న్యాయ వ్యవస్థను మైనరిటిల చేతిలో పెట్టె ప్రయత్నం చేస్తుంది, పొలిసు ఉన్నతాదికారులు సహితం కేసు పురోగతిని ప్రతివారం ఫిర్యాది కి తెలపాలనడం ఇందుకు నిదర్శనం.
  6. ఈ బిల్లు వలన హిందువులేవరు " ముస్లీం " అనే పదాన్ని కుడా ఉచ్కరించలేరు, ఎవరైనా ముస్లీం వ్యాపారవేత్త హిందూ వ్యాపారుల వలన తన వ్యాపారం జరగటంలేదు అని ఫిర్యాదు చేస్తే ఆ హిందూ వ్యాపారులు మత హింస నిరోద బిల్లు పరిధిలోకి వస్తారు.
ఈ బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంటుకు , కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయాలని కోరారు, ప్రభుత్వ యంత్రాగాన్ని , న్యాయవ్యవస్థను మైనారిటిల చేతిలో పెట్టె ఈ బిల్లుకు వ్యతిరేకంగా దేశ వ్యాప్త ప్రజాస్వామిక ఉద్యమానికి సమాయత్తం కావాలని ఆయన పిలుపునిచ్చారు .       
Source: www.samvada.org 

Wednesday, 4 December 2013

మిర్యాలగూడలో తిరిగి హిందుత్వంలోకి వచ్చిన 12 క్రైస్తవ కుటుంబాలు

మిర్యాలగూడ , ధర్మప్రసార్ , 28-Nov-2013 : మిర్యాలగూడ పట్టణం లోని శ్రీ సాయి దత్త ఆశ్రమం లో జరిగిన పునరాగమణ కార్యక్రమంలో చుట్టూప్రక్కల ఆరు గ్రామాలకు చెందిన 12 కుటుంబాల నుండి 48 మంది గత కొన్ని సంవత్సరాల క్రితం క్రైస్తవ మతాన్ని స్వీకరించారు , కాని వారి పూర్వికుల ధర్మానికి అన్యాయం జరుగుతుంటే , తాము అనేక తరాలుగా పూజిస్తున్న దేవుళ్ళను సైతాన్లు అని అంటుంటే భరించలేక తమ తప్పిదాన్ని తెలుసుకుని శ్రీ సాయి దత్త ఆశ్రమం లో కి  శ్రీశ్రీశ్రీ స్వామి సత్యాపాదానంద స్వామిజి మార్గదర్శనం లో తిరిగి తమ మాత్రు ధర్మమైన హిందుత్వాన్ని స్వీకరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య వక్త గా హాజరైన శ్రీ గుమ్ముల్ల సత్యం విశ్వ హిందు పరిషద్ కేంద్రీయ సహా కార్యదర్శి హిందూ ధర్మ వైభవాన్ని వివరించారు , అలాగే దారి తప్పిన మన సహోదరులను సక్రమ మార్గంలోకి పెట్టాల్సిన బాధ్యత మన అందరిది అని గుర్తుచేశారు . 



ఈ కార్యక్రమంలో BS మూర్తి గారు , బొడ్ల మాలికార్జున్ గుప్త గారు , శ్రీ ఉపేందర్ గారు , మొదలగువారు పాల్గొన్నారు , కార్యక్రమ అనంతరం స్వధర్మాన్ని స్వీకరించిన వారికి క్రొత్త బట్టలు , శ్రీ రాముని చిత్ర పటాలు పంపిణి చేయడం జరిగింది .    

విశ్వ హిందు - Dec - 2013

(or)
Download as pdf format


Sunday, 20 October 2013

అం.ప్ర లో 2500 స్థానాలలో 3.5 లక్షల మందితో విహిప అయోధ్య రామ మందిర సంకల్ప సభలు

విజయ శ్రీ భవనం , భాగ్యనగర్ : విశ్వ హిందూ పరిషద్ కేంద్రీయ మార్గదర్శక మండలి సమావేశాలలో నిర్ణయించబడిన కార్యకరమాలలో భాగంగా తేది 18/10/2013 నాడు వాల్మీకి జయంతిని పురస్కరించుకుని " శ్రీ అయోధ్య రామ మందిర నిర్మాణ సంకల్ప సభలు " దేశ వ్యాప్తంగా లక్ష స్థానాలలో నిర్వహించాబడ్డాయి, అందులో భాగంగానే ఆంధ్ర ప్రదేష్ లోని ( పూర్వ ఆంధ్ర ప్రదేష్ , పశ్చిమ ఆంద్ర ప్రదేష్ ) రెండు ప్రాంతాలలో కలిపి సుమారు 2500 స్థానాలో ఈ సంకల్ప సభలు  నిర్వహించబడ్డాయి , ఈ సభలలో సుమారు మూడు లక్షల యాభై వేల మంది రామ భక్తులు అయోధ్య శ్రీ రామ జన్మ భూమిలో భవ్య మందిర నిర్మానార్థమై సంకల్పం తీసుకున్నారు .   
అయోధ్యలో శ్రీ రామ్ లలా ఇక ముందు చిన్న డేరా ఉండటం హిందూ సమాజం సహించజాలదు , తరతరాల నుండి ఏ మర్యాదా పురుషోత్తముని జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఈ దేశం నడిచిందో ఆ శ్రీ రామునికి భవ్య మందిరం నిర్మాణం జరిగి ఈ దేశ స్వాభిమానం సగర్వంగా నిలిచే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది 
- శ్రీ మాధవ రెడ్డి గారి గాల్ రెడ్డి విహిప పశ్చిమాంధ్ర కార్యదర్శి  
అయోధ్య శ్రీ రామ జన్మ భూమి లో భవ్య శ్రీ రామ మందిర నిర్మాణానికి ప్రభుత్వం ఈ శీతాకాల సమావేశాలలో తక్షణం చట్టం చేయడం ద్వార మార్గం సుగుమం చేయాలి , లేకపోతే 2014 ఎన్నికలలో శ్రీ రామ భక్తులు ఓటు హక్కు నే ఆయుధంగా చేసుకుని తమ శక్తి ప్రదర్శన చేయాల్సి వస్తుంది
- శ్రీ హన్మంత్ రావు విహిప పూర్వాంధ్ర కార్యదర్శి

Saturday, 19 October 2013

సాకారం కాని స్వప్నం విడియో : బాబరు దురాక్రమణ నుండి బాబ్రీ విధ్వంసం వరకు శ్రీ రామ జన్మభూమి ఉద్యమం పై సజ్జన భారతి డాక్యుమెంటరి


  • మీర్ బాకి అధ్వర్యంలో బాబరు దురాక్రమణ నుండి 1992 డిసెంబర్ 6 గీతా జయంతి బాబ్రీ విద్వంసం వరకు 
  • 76 యుద్ధాలు వేలాది రామ భక్తుల బలిదానాలు చివరికి  1992 కరసేవలో స్వల్ప విజయం 
  • అయిన ఇంకా సాకారం కాని భక్తుల సుందర స్వప్నం భవ్య రామ మందిర నిర్మాణం 
  • సజ్జన భారతి ప్రత్యేక డాక్యుమెంటరి శ్రీ రామ జన్మ భూమి పై పూర్తీ సమాచారం  చూడండి  


Thursday, 10 October 2013

పశ్చిమాంధ్ర లో 7 చోట్ల విజయవంతం గా పూర్తైన భజరంగ్ దళ్ ' శౌర్య ప్రశిక్షణ వర్గ ' లు

విజయ శ్రీ భవన్ , భాగ్యనగర్ : విశ్వ హిందూ పరిషద్ యువ విభాగం అయిన భజరంగ్ దళ్ కార్యకర్తల శౌర్య ప్రశిక్షణ వర్గ లు ( అంతర్గత శిక్షణ తరగతులు) తేది అక్టోబర్ 6 నుండి 10 వరకు ఐదు రోజుల పాటు ఏడు స్థలాలలో విజయవంతంగా పూర్తీ అయ్యాయి 
  1. మంత్రాలయం ( కర్నూలు విభాగ్ ) : 42 మంది శిక్షార్థులు 6 గురు శిక్షకులు 4 గురు ప్రబందకులు
  2. పాలమూరు ( పాలమూరు విభాగ్ ) : 76 మంది శిక్షార్థులు 4 గురు శిక్షకులు 13 గురు ప్రబందకులు 
  3. మెదక్ (మెదక్ విభాగ్ ) : 42 మంది శిక్షార్థులు 5 గురు శిక్షకులు 6 గురు ప్రబందకులు
  4. బోధన్ ( ఇందూరు విభాగ్ ) : 84 మంది శిక్షార్థులు 6 గురు శిక్షకులు 15 గురు ప్రబందకులు
  5. గోదావరి ఖని ( కరినగరం విభాగ్ ) : 45 మంది శిక్షార్థులు 8 గురు శిక్షకులు 15 గురు ప్రబందకులు
  6. నల్గొండ ( నల్గొండ విభాగ్ ) : 34 మంది శిక్షార్థులు 3 గురు శిక్షకులు 4 గురు ప్రబందకులు
  7. భాగ్యనగర్ ( భాగ్యనగర్ విభాగ్ ) : 35 మంది శిక్షార్థులు 3 గురు శిక్షకులు 6 గురు ప్రబందకులు 
  8. పశ్చిమాంధ్ర  మొత్తం : 358 మంది శిక్షార్థులు 35 గురు శిక్షకులు 57 గురు ప్రబందకులు

ప్రాంత స్థాయి అధికారులు అన్ని వర్గలలో పర్యటించి శిక్షార్థులకు అనేక శారిరిక, మానసిక, ఆధ్యాత్మిక , సామాజిక , చారిత్రక అంశాలతో పాటుగా వారి వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన శిక్షణను అందిచారు . 


















Tuesday, 1 October 2013

2008 స్వామి లక్ష్మణానంద హత్య కేసులో 7 క్రైస్తవులను దోషులుగా తేల్చిన కోర్టు! గురువారం శిక్షలు ఖరారు


2008 కందమాల్ లో జరిగిన హింసాఖాండను క్రైస్తవుల పై జరిగిన దాడులుగా గోబెల్స్ ప్రచారం చేసిన కుహన లౌకికవాదులు , క్రైస్తవ మేధావులారా ! నిజం ప్రపంచం ముందుకొచ్చింది , ఇప్పుడు ఎందుకు మీరు మౌనంగా ఉన్నారు ? మీరు హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి ! - రాష్ట్రచేతన  
స్వామి లక్ష్మణానంద ( పాత చిత్రం )
భువనేశ్వర్ , ఒడిస్సా , 01/10/2013 :  2008 కందమాల్ లో జరిగిన స్వామి లక్ష్మణానంద సరస్వతి మరియు  అతని నలుగురు సహాయకుల హత్య కేసులో ఏడు గురు క్రైస్తవులను దోషులుగా తెలుస్తూ ఒడిస్సా లోని న్యాయస్థానం తీర్పును వేలువడించింది .     
కందమాల్ జిల్లా న్యాయస్థాన ప్రత్యేక అదనపు న్యాయమూర్తి శ్రీ RK తొస్ గారు తన తీర్పును ఒడిస్సా రాజధాని భువనేశ్వర్ కు సుమారు 200 KM దూరంలోఉన్న ఫుల్భాని న్యాయస్థానం లో వెల్లడిస్తూ శిక్షలను అక్టోబర్ 03 ణ ఖరారు చేస్తున్నట్ల్టు తెలిపారు .
2008 లో దాదాపు 50 మందితో కూడిన జన సముహముతో స్వామి లక్ష్మణానంద ఆశ్రమము పై దాడి చేసిన వారిలో దుర్యోధన్ సున మజ్హి , సనతాన్ బడ మజ్హి , గల్నాథ్ చలన్సేత్ , బ్రిజేయ్ కుమార్ సంసీ , భాస్కర్ కుమార్ మజ్హి మరియు భుధదేవ్ నాయక్ లను న్యాయస్థానం దోషులుగా తెల్చిందని, తమని స్వామి క్రైస్తవం నుండి హిందువులుగా మారమని బలవంతం చేసినందునే హత్య చేయమని వారు కోర్టుకు తెలిపారని న్యాయవాది మీడియా కు తెలిపారు .
2009 జనవరిలో నిందుతులపై పోలీసులు తోలి అభియోగా పత్రాన్ని నమోదు చేసారు , 2011 లో మరో ఇద్దరు మావోయిస్టు నాయకులు పొలారి రామా రావు , సవ్యసాచి పండా లను నిందితులగా చేరుస్తూ రెండో చార్జ్ షీట్ ను నమోదు చేసారు . రెండో చార్జ్ షీట్ లో తీర్పును మంగళవారం కోర్టు వెలువడించనుంది.

"మతమెప్పుడు డబ్బా పాలవంటిదే, హిందూ ధర్మం తల్లిపాలవంటిది" ; కోరుట్ల హిందూ శంఖారావం లో స్వామి పరిపూర్ణనంద


  • హిందూ ధర్మ జాగృతి కై జనం లోకి వచ్చాను 
  • మతం డబ్బా పాలవంటిది , హిందూ ధర్మం తల్లి పాల వంటిది 
  • ఈ దేశం లో ఒక్క ఆవు కసాయివాని చేతుల్లోకి వెళ్ళడానికి వీల్లేదు 
  • లౌకిక దేశం లో  సన్యాసి దేవాలయాన్ని దర్శించడానికి ఆటంకాల ?
  • కోరుట్ల హిందూ శంఖారావం లో  శ్రీశ్రీశ్రీ స్వామి పరిపూర్ణానంద     

30/09/2013 కరినగరం,కోరుట్ల: శ్రీ పీఠంలో కూర్చుని ఉండలేక, ప్రస్తుత దేశ పరిస్థితుల దృష్ట్యా హిందూ ధర్మ పరిరక్షణ, సమాజ జాగృతికే జనంలోకి వచ్చానని శ్రీ పీఠాధిపతి పరిపూర్ణానంద సరస్వతి స్వామిజీ అన్నారు. యుద్ధం చేయడం తన అభిమతం కాదని హిందూ ధర్మాన్ని విచ్ఛినం చేస్తున్న శక్తులను ఎదుర్కొనేందుకే జాతిని సన్నద్ధం చేయడమే తన పర్యటన లక్ష్యమని పునరుద్ఘటించారు. సోమవారం రాత్రి కోరుట్ల పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానం లో నిర్వహించిన హిందూ శంఖారావానికి ఆయన హాజరై మాట్లాడారు.
హిందుత్వం ఒక మతం కాదని, అది ఓ ధర్మంగా అభివర్ణించారు. మతమెప్పుడు డబ్బా పాలవంటిదే, ధర్మం తల్లిపాలవంటిది. అలాంటి ధర్మానికి ప్రచారం అక్కర్లేదన్నారు. హిందూ ధర్మంలో సర్వ మతాలను సమాదరించే సహజలక్షణం ఇమిడి ఉందన్నారు. ఇతర మతాల్లో ఆ లక్ష ణం లోపించి హైందవ సంస్కృతిలో భేదాలను సృష్టిస్తున్నాయని, ఆలాంటి కలుపు మొక్కలను ఏరివేయడానికి హైందవులంతా ఐక్యమై ధర్మ పరిరక్షణకు పోరాడాలన్నారు.

భారతీయ సంస్కృతిలో ప్రతీ వస్తువును దైవంగా పూజించే తత్వముందని, మనిషిని దేవునిగా సంస్కరించే గుణా న్ని రాముడి చేతల్లో, కృష్ణుడి మాటల్లో ప్రదర్శించారని పేర్కొన్నారు. అలాంటి దైవాల్ని తులనాడుతున్న నాలుకలను శుద్ధి చేయడం కూడా తన పర్యటన లక్ష్యమన్నారు. దేశానికి ఆయువు పాయువు అయిన గోవులను వధిస్తూ, హైందవ దేవుళ్లను తులనాడుతూ వంద కోట్ల హిందువులను అడ్డంగా నరికేస్తామంటూ రంకెలేస్తున్న మతోన్మాదులకు హెచ్చరికలుగా హిందూ యువకులంతా ఐక్యమై బలనిరూపణ చేయాలన్నారు. వందకోట్ల హిందువులున్న ఈ భారతదేశంలో వివక్ష పూరిత రాజకీయం కొనసాగుతోందని, మక్కా, జెరుసలేంకు వెళ్లేందుకు రాయితీని కల్పించే ప్రభుత్వాలు ఒక హిందువు కాశీ వెళ్లడానికి రూపాయి రాయితీ కల్పించడం లేదన్నారు. బ్రహ్మోత్సవాలకు వెళితే అదనపు చార్జీలు వసూలు చేసే ఈ ప్రభుత్వాలకు లౌకికవాదం ఉందా అని ప్రశ్నించారు.

హిందువుకు బిందువైన నాయకులు రావాలి...
హైందవ ధర్మాన్ని కాపాడుతూ, సర్వ మతాలను సమాదరిస్తూ గోవధ లేని సమాజాన్ని నిర్మించగలిగే నాయకుల్ని తయారు చేయడం కోసం జనమంతా సిద్ధం కావాలని అన్నారు. అలాంటి నాయకుడు ఎలా ఏ మతంలోంచి వచ్చినా భారతీయ సంస్కృతిని పరిరక్షించే వాడైతే స్వాగతిస్తామని పేర్కొన్నా రు. తనకు ఏ పార్టీ ముఖ్యం కాదని, తాను పార్టీలకు చెందిన వాడను కాదని, హిందూ ధర్మ పరిరక్షణే తన సిద్ధాంతమన్నారు. ఇదికాకా భారతీయులంతా ఈ మట్టిని నమ్ముకొని జీవిస్తున్నారని, ఈ మట్టిలో కలిసిపోయే ముందు హిందూ ధర్మాన్ని తన వెంట తీసుకోవడమే కాక ఆ ధ ర్మాన్ని నిలబెట్టే ఒక్క వారసున్ని అయినా అం దించాలని, ఆ ప్రయత్నంలో ఒక్కో హిందు వూ నలుగురిని కన్నా ఇబ్బంది లేదని తెలిపారు.
ఇది నిజాం రాష్ట్రం కాదు... పక్కా తెలంగాణే...స్త్రీ, పురుష, ధన, మాన, ప్రాణాలు దోచుకొని అత్యంత హేయంగా ప్రవర్తించిన నిజాం కు ఈ తెలంగాణ జాగీరు కాదన్నారు. నిజాని కి తెలంగాణలో నిజాం అద్దెకున్నాడు తప్పితే అతినికి ఏ హక్కూ లేదన్నారు. ఇది అచ్చంగా తెలంగాణ రాష్ట్రమే తప్పా నిజాం రాష్ట్రం కాదని స్పష్టం చేశారు.
ఇది కరినగరి!శంకర భగవత్పాదులు ఈ దేశనికి, ప్ర పంచానికి తిండిపెట్టి పోషించే శక్తి ఉందన్న ట్లు... కరినగరి జిల్లాకు కూడా అంతటి శక్తి ఉందని, కనుక ఇది కరీంనగర్ కాకుండా కరినగరిగా స్వామిజీ అభివర్ణించారు. భవిష్యత్తులో అది శాశ్వతంగా కరినగిరిగానే స్థిరపడనుందని జోస్యం చెప్పారు.

దేశోద్ధారణకు నడుం బిగించాలి... డాక్టర్ అన్నదానం చిదంబరం శాస్త్రీ
హైందవ ధర్మ ప్రచారకులు డాక్టర్ అన్నదానం చిదంబరంశాస్త్రీ మాట్లాడుతూ దేశం లో పూజనీయమైనవి అవమానించబడుతుండడం వల్ల అశాంతి, అలజడులు ప్రజ్వరిల్లుతున్నాయన్నారు. ఐన్‌స్టీన్ వంటి శాస్త్రవేత్తలు భ గవద్గీతతో ప్రేరణ పొందిన వారేనని, గీతాసా రం గ్రహించి దేశోద్ధరణకు నడుం కట్టాలన్నారు.
హిందూ ధర్మానికి భంగం కలిగేది బయ ట నుంచి మాత్రమే కాదని, అంతర్గత శక్తులు కూడా పతనానికి కారణమవుతున్నాయని బాచంపల్లి సంతోష్‌కుమార్‌శర్మి అన్నారు. హైందవ దర్మ పరిరక్షణ వేదిక ఆద్వర్యంలో జరిగిన ఈ శంఖారావంలో సుమారు 20 వేల మంది జనం హాజరుకాగా ఎమ్మెల్యే కల్వకుం ట్ల విద్యాసాగర్‌రావు దంపతులతో పాటు బీజేపీ నేత సురభి భూమ్‌రావు, బీజేపీ కరీంనగర్ నగర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్, బీజేపీ, టీఆర్ఎస్, టీడీపీ, విశ్వహిందూ పరిష త్, ఆర్ఎస్ఎస్, భజరంగ్‌దళ్, ఏబీవీపీ, యు వజన సంఘాలు, టీటీడీ ధర్మ ప్రచార సమితి, హిందూ ధర్మ ప్రచార సమితి, ఆహ్వాన కమిటీ నాయకులు మంచాల జగన్, ఇందూరి స త్యం, తిరుమల వాసు, తోకల రమేశ్, పెం డం గణేశ్, తనగుల రాజశేఖర్, కొత్త సురే శ్, గడ్డం మధు, రేగుల భూమానందం, గిన్నెల శ్రీకాంత్, శివకుమార్, రాజ్ గంగారాం పాల్గొన్నారు.

- Source: http://www.andhrajyothy.com/

విశ్వ హిందు - Oct - 2013

(or)
Download as pdf format



Sunday, 29 September 2013

విజయశ్రీ భవన్,కోఠి లో విహిప అర్చక పురోహిత సమ్మేళనం , పాల్గొన్న హెబ్బార్ నాగేశ్వర్ రావ్ గారు

భాగ్యనగర్ , కోఠి  29/09/2013 : విశ్వ హిందూ పరిషద్ పశ్చిమాంధ్ర ప్రాంత కార్యాలయం విజయ శ్రీ భవనం , కోఠి , భాగ్యనగర్ ( హైదరాబాద్ ) లో విహిప అర్చక పురోహిత విభాగం ప్రాంత స్థాయి కార్యకర్తల సమావేశం 29/09/2013 నాడు జరిగింది , ఈ సమావేశానికి మాన్య శ్రీ రామరాజు గారు విహిప ప్రాంత అధ్యక్షులు అధ్యక్షత వహించగా ,విహిప ప్రాంత ప్రచార ప్రాముఖ్ తుంగేడుగుంట హెబ్బార్ నాగేశ్వర్ రావ్ గారు ప్రధాన వక్తగా పాల్గొన్నారు .
రామరాజు గారు మార్గదర్శనం చేస్తూ ' వచ్చే సంవత్సరం విశ్వ హిందూ పరిషద్ స్వర్ణ జయంతి సందర్భంగా మనం ప్రతి ఇంటిని చేరగలగాలి , ప్రతి హిందువు మదిలో రాష్ట్ర భక్తీ , రామ భక్తీ నింపాల్సిఉంది , కేవలం హిందూ సంఘటన కార్యం మాత్రమె ఈ దేశాన్ని విశ్వ గురువుగా నిలపగల్గుతుంది, హిందువుల శ్ర్తద్డ కేంద్రాల ద్వారా సంస్కారం నిర్మాణం జరుగుతుంది , ఆ శ్రద్ద కేంద్రాల ప్రత్యక్ష నిర్వాహకులుగా ఈ దిశలో మనం చేయాల్సిన పని ఎంతో ఉంది , ఆ కార్యానికై మనం ఎక్కువ సమయం ఇచ్చి పనిచేయాల్సి ఉంది ' అని అన్నారు .

హెబ్బార్ నాగేశ్వర్ రావ్ గారు దిశానిర్దేశం చేస్తూ ' నేడు హిందుత్వం మందిరాల మాధ్యమం గానే నిలబడి ఉంది , అలాంటి మందిర నిర్వాహకులుగా అర్చకులు , పురోహితులు తరతరాలుగా హిందూ సమాజానికి ధర్మసంబంద విషయాలలో మార్గదర్శకులుగా ఉంటూ వస్తున్నారు , పురోహితుని కేంద్రంగా గుడి , ఆ గుడి కేంద్రంగా ఒక బడి , ఈ రెండింటి ఆధారంగా ఆదర్శ సమాజ నిర్మాణం ఇది హిందూ ఆరాధనా కేంద్రాల లక్షణం, లక్ష్యం . హిందూ కుటుంబ వ్యవస్థలో , హిందువుల వ్యక్తిత్వ వికాసం లో , ప్రపంచంలో లోని అన్ని మతాల లోకెల్లా హిందూ ధర్మాన్ని సర్వ శ్రేష్టంగా నిలపడం లో ఆలయాలు విశిష్ట పాత్రను నిర్వహించాయి , భారత స్వరాజ్య సంగ్రామం లో దేవాలయాలు యుద్ధ వీరుల శిక్షణ కెంద్రాలయ్యాయి , దేశ భక్తుల ఆవాసలయ్యాయి, ఆలాంటి మందిరం ద్వార తిరిగి ఒక సారి హిందూ ధర్మ జాగరణ , సంఘటన జరగాలి ' అని అన్నారు .
ఈ కార్యక్రమం లో విహిప ప్రాంత కార్యదర్శి మాధవరెడ్డి గారి గాల్ రెడ్డి గారు ప్రాంత కార్యదర్శి , ఆకారపు కేశవా రాజు గారు ప్రాంత సంఘటన కార్యదర్శి , యాదగిరి రావ్ గారు క్షేత్ర గో - రక్షా ప్రాముఖ్ తదితరులు పాల్గొన్నారు .          

Saturday, 14 September 2013

తిరుపతిలో ఇస్లామిక్ విశ్వ విద్యాలయం - దేవాదాయ స్థలంలోనే ఏర్పాటు !

  • చంద్ర గిరి సమీపంలో నిర్మాణ పనులు
  • దేవాదాయ స్థలంలోనే ఏర్పాటు
  • హిందూ ధార్మిక ప్రాంతంలో అన్యమతానికి చోటా?
  • నిధుల సేకరణకు విదేశాల్లో ప్రచారం
  • ఇది అంతర్జాతీయ కుట్ర,ప్రభుత్వ పాత్రా ఉంది
హైదరాబాద్, తిరుపతి, సెప్టెంబర్ 13 : ఏడుకొండల వాడి నిలయమైన తిరుపతి కొండల్లో అంతర్జాతీయ ఇస్లామిక్ విశ్వవిద్యాలయాన్ని నిర్మిస్తున్నారని, ఇది ముమ్మాటికీ అంతర్జాతీయ కుట్రేనని బీజేపీ ఆరోపించింది. నౌహెరా షేక్ అనే మహిళ పేరిట గుట్టు చప్పుడు కాకుండా విశ్వవిద్యాలయ నిర్మాణ పనులు సాగుతున్నాయని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తెలిపారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ స్థలంలోనే దీన్ని నిర్మిస్తున్నారని, ప్రభుత్వానికి ఇదంతా తెలియకుండా జరుగుతుందా? అని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. "తిరుమల కొండకు కాలి నడకన వెళ్లే చంద్రగిరి శ్రీవారి మెట్టు సమీపంలో "హీరా ఇంటర్నేషనల్ ఇస్లామిక్ కాలేజీ'' పేరుతో అంతర్జాతీయ ఇస్లామిక్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

ఉర్దూ అరబిక్ పాఠశాల, మదర్సా అని ప్రచారం చేస్తూ దీని నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు. నౌహెరా షేక్ చైర్మన్‌గా గల హీరా ఉర్దూ అరబిక్ డెవలప్‌మెంట్ సొసైటీ పేరిట దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. దేవాదాయ శాఖ స్థలంలో 2011 నుంచి దీని పనులు సాగుతున్నాయి. అంతేకాదు.. ఇదే సొసైటీ పేరిట విశ్వ విద్యాలయ స్థలంలో కాలేజీని, మదర్సాను, అరబిక్ ఉర్దూ పాఠశాలను నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. వీటన్నింటినీ వెబ్‌సైట్‌లో ఘనా, చైనా, కెనడా వంటి దేశాల్లో ప్రచారం సాగిస్తున్నారు. తిరుపతిలో పెట్టామని చెబుతూ విదేశాల నుంచి నిధులు, వనరులు రాబడుతున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా తిరుపతిలో పుట్టిన నౌహెరా షేక్ పేరును ఈ కార్యకలాపాలకు పూర్తిగా వినియోగించుకుంటున్నట్లు అవగతమవుతుంది'' అని ఎన్వీఎస్ఎస్ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి, గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. మరోవైపు దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ అధికార ప్రతినిధి భాను ప్రకాశ్‌రెడ్డి, నేతలు సామంచి శ్రీనివాస్, మధుసూదన్, నాగేశ్వర్‌రావు తిరుపతిలో డిమాండ్ చేశారు. విద్యార్థినుల ముసుగులో తిరుమల-తిరుపతిలోకి అసాంఘిక శక్తులు ప్రవేశించి విధ్వంసం చేసే అవకాశం ఉందన్న సమాచారం తమ వద్ద ఉందన్నారు.


ఇంతకీ ఏం జరుగుతోంది?
తిరుపతికి పది కిలోమీటర్ల సమీపంలో చంద్రగిరి మండలం, తొండవాడ వద్ద హీరా అంతర్జాతీయ ఇస్లామిక్ కాలేజీ పేరుతో 1.09 ఎకరాల విస్తీర్ణంలో ఆరు అంతస్థుల భారీ భవనాన్ని నిర్మించారు. చుట్టూ 12 అడుగలు ఎతైన ప్రహరీ గోడ నిర్మించారు. భవన నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. భవన నిర్మాణానికి తుడ అనుమతి కూడా తీసుకున్నారు. ముస్లిం మహిళలకు స్వయం ఉపాధి కోర్సులతో పాటు, ఇస్లాం మత బోధనల కోసమే ఈ కళాశాలను స్థాపిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు.

దీని వ్యవస్థాపకురాలు నౌహీర్ చాలా ఏళ్లుగా రేణిగుంట సమీపంలో మదర్సాను నడుపుతున్నారు. గతంలో ఆమె ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లారు. అక్కడి పరిచయాలతోనే ఇస్లామిక్ విద్యా సంస్థను ప్రారంభిస్తున్నట్టు చెబుతున్నారు. కాగా, ఈ సంస్థ పేరుతో ఉన్న హీరాఐబీజీ.కామ్‌లోని వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. చైనా సహా ఐదు దేశాల్లో ఈ సంస్థ వ్యాపార కార్యకలాపాలు సాగుతున్నట్టు తెలుస్తోంది. వీటి వార్షికోత్సవాలు, షేర్ హోల్డర్ల సమావేశాలన్నీ ముంబై కేంద్రంగా జరుగుతున్నట్లు వైబ్‌సైట్‌లో పేర్కొన్నారు.

Heera Business Gruops Web Site : http://heeraibg.com/heeraibg/
Heera International Islamic School Web Site : http://heeraiisg.com/index.php
Heera International islamic Collage Web Site : http://heerauniversity.com/

VHP Remembers legacy of KS Sudarshan on the First Death Anniversary

VHP, RSS Swayamsevaks, well wishers, thinkers of different spectrum remembering KS Sudarshan, former RSS Sarasanghachalak on his first death anniversary.
KS Sudarshan, RSS foermer Sarasanghachalak
KS Sudarshan, RSS foermer Sarasanghachalak
Born on June 18th 1931,  Kuppalli Sitaramayya Sudarshan, became 5th RSS Sarasanghachalak of RSS, served from 2000 to 2009. Sudarshan was considered to be one of greatest known Hindutva ideologue in India , passed away on September 15, 2012 at Raipur last year.
Here are some compilation of articles on Sudarshan:

KS Sudarshan- A leader who broke barriers : writes TARUN VIJAY

Vajapeyi and Others national leaders on Sudarshanji

My uncle Sudarshanji, a person of deep and rock-solid conviction; writes Sameer Kuppahalli

Ex-RSS chief Sudarshan reached out to Muslims: Khaleej Times


Church’s Arch Bishop praises Sudarsanji’s effort on Social Harmony

NAGPUR: With heavy waves of emotions, Funeral of Sudarshanji held, brother performs last rites


Thursday, 12 September 2013

' ముజఫర్ నగర్ అల్లర్ల వెనుక వరుస హత్యాచారాలు ' : ఇండియా వైర్ విశ్లేషనాత్మక కథనం


ముజఫర్ నగర్ , ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన మత ఘర్షణల నేపథ్యాన్ని చూస్తే గత కొన్ని రోజులగా పట్టణం లో జరిగిన సంఘటనలు , ఒక ఈవ్ టీసింగ్ ఘటన మరియు ఒక యుటుబ్ వీడియో మాత్రమే కారణం కాగలవ ? అన్న సంశయం అందరికి వస్తుంది , దానికి సమాధానం కోసం  గత సంవత్సర కాలంగా ముజఫర్ నగర్ పట్టణం లో జరిగిన వరుస అత్యాచారాలు వాటిని సమర్థిస్తూ చేసిన రాజకీయం లాంటి అంశాలను చూడాల్సిఉంది 
.
   
 
వెలుగులోకి వచ్చిన కొన్ని సంఘటనల క్రమం   : 
  • 21-Dec-2012 : ఒక హత్యాచార బాదితురాలికి ఈ విషయాన్ని దాచడం కోసం రూ 1.5 లక్షలు ఆశచూపింది ముజఫర్ నగర్ పంచాయితీ ( పూర్తీ వివరాలకు )
  • 24-Dec-2012 : ముజఫర్ నగర్ లో  ఒక మైనరు బాలిక ముగ్గురు యువకుల చేతిలో సాముహిక హత్యాచారానికి గురైంది  పూర్తీ వివరాలకు )
  • 26-Dec-2012 : పాఠశాలలో చదివే అమ్మాయి పై ఒక ఉపాధ్యాయుడు లైంగిక దాడి చేసాడు . ( పూర్తీ వివరాలకు ) 
  • 30-Dec-2012 : ముజఫర్ నగర్ లో  ఆగంతకులు చేసిన యాసిడ్ దాడిలో ఇద్దరు మహిళలు గాయపడ్డారు ( పూర్తీ వివరాలకు ) 
  • 18-Feb-2013 : ముజఫర్ నగర్ లో ఒక మహిళ నలుగురు వ్యక్తుల చేటిలో సాముహిక అత్యాచారానికి గురైంది , ఆ అత్యాచారాన్ని విడియో తీసారు ( పూర్తీ వివరాలకు)
  • 03-Apr-2013 : ముజఫర్ నగర్ లో ముగ్గురు ఉపాధ్యాయినిలు , ఒక విద్యార్తి పై యాసిడ్ దాడి జరిగింది ( పూర్తీ వివరాలకు )
  • 03-Jun-2013 : ఒక మైనరు బాలిక హత్యాచారానికి గురైంది ( పూర్తీ వివరాలకు )
  • 05-Jul-2013 : సాముహిక అత్యాచార నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఒక వ్యక్తీ ఆత్మాహుతికి పాల్పడ్డారు ( పూర్తీ వివరాలకు  )
  • 29-Jul-2013 : మహిళ బలవంతంగా పెళ్లిచేసుకోబడి తర్వాత సాముహిక అత్యాచారానికి గురైంది ( పూర్తీ వివరాలకు ) 
  • 23-Aug-2013 : ఒక పాఠశాల విద్యార్థిని 5 గురు యువకుల చేతిలో సాముహిక హత్యాచారానికి గురైంది ( పూర్తీ వివరాలకు ) 
  • 24-Aug-2013 : 9 వ తరగతి చదివే అమ్మాయి యువకుని చేతిలో హత్యాచారం చేయబడింది ( పూర్తీ వివరాలకు ) 
  • 27-Aug-2013 : కావాల్ గ్రామంలో జరిగిన ఒక ఈవ్ టీసింగ్ ఘటన మూడు బైక్ ల దగ్దానికి , ఘర్షణకు దారి తీసింది . 
  • 30-Aug-2013 : 11 సంవత్సరాల అమ్మాయి పై లైంగిక దాడి చేసిన ఘటనలో ఒక ముస్లీం మత పెద్ద అరెస్టు అయ్యారు ( పూర్తీ వివరాలకు )
  • 30-Aug-2013 : శుక్రవార ప్రార్థన ల అనతరం అల్లరిముక ల భారి సమూహం షహీద్ చౌక్ లో సమావేశమయి అటుగా వెళ్తున్న మహిళా భక్తుల పై దాడి చేయడం జరిగింది .
  • 31-Aug-2013 : నంగల మందౌద్ పంచాయితీలో దాదాపు 40,000 మంది సమావేశమయ్యారు , ఖతిమ రోడు లో కారులో వెళ్తున్న ఒక కుటుంబం పై దాడి జరిగింది , కారు దగ్దం చేయబడింది .
  • 01-Sep-2013 : దాడికి గురైన కుటుంబం ఆత్మాహుతి హెచ్చరికలతో , షహీద్ చౌక్ సమావేశంలో రెచ్చగొట్టే ఉపన్యాసాలు ఇచ్చిన ఇద్దరు నాయకులో FIR నమోదు చేయడం జరిగింది .
  • 02-Sep-2013 : సంఝాక్ మరియు తివ్తి లలో దేవాలయాల గోడలు ద్వంసం చేయబడ్డాయి , BJP ముజఫర్ నగర్ బందు కు పిలుపునిచ్చింది .
  • 03-Sep-2013 : కావాల్ లో జరిగింది అంటూ చేసిన అసత్యపు విడియో ప్రచారామ్ పై పొలిసు కేసు నమోదు చేయబడింది , శామ్లి నగరం లో హింస చేల రేగింది .
  • 04-Sep-2013 : ముజఫర్ నగర్ లో చెదురు-మదురు హింసాత్మక సంఘటనలు జరిగాయి .
  • 05-Sep-2013 : ముజఫర్ నగర్ జిల్లా మహా బందుకు ఖప్ పంచాయితీ (అక్కడి జాట్ తెగకు సంబందిచి అత్యన్నత నిర్ణాయక మండలి ) పిలుపు నివ్వడం జరిగింది , తేది 07-Sep-2013 న నగ్నల మండుర్ లో " భాహు బేటి సమాన్ బచాయో మహా పంచాయితీ " నిర్వహించ నోతున్నట్లు ప్రకటించడం జరిగింది .
  • 07-Sep-2013 : ముందుగా ప్రకటించిన విధంగానే నగ్నల మండుర్ లో " భాహు బేటి సమాన్ బచాయో మహా పంచాయితీ " నిర్వహించబడినది , దాదాపు లక్షా ఇరవై వేల మంది దీనిలో పాల్గొన్నారు , పాల్గొని తిరిగి వెళ్తున్న వారి పై దాడులు జరిగాయి .
  • ముజఫర్ నగర్ లో కాల్పులు జరిగాయి , హింసాయుత వాతావరణం నెలకొని ఉండటంతో సైన్యం కర్ప్యు విధించింది , ఇప్పటి వరకు జరిగిన ఘటనలో దాదాపు 30 మంది ప్రాణాలు కోల్పోయారు .
Source: www.samvada.org   

About Me

Powered by Blogger.

Blog Archive

Contact us

Name

Email *

Message *

Top Ad unit 728 × 90

Disqus Shortname

Comments system

Ad Inside Post

వార్తా - హైందవం

News

Contact Form

Name

Email *

Message *

Purchasing Code

Home PageNav

PageNav Posts Number

Scroll Animation

Boxed Style