![]() |
| స్వామి లక్ష్మణానంద ( పాత చిత్రం ) |
భువనేశ్వర్ , ఒడిస్సా , 01/10/2013 : 2008 కందమాల్ లో జరిగిన స్వామి లక్ష్మణానంద సరస్వతి మరియు అతని నలుగురు సహాయకుల హత్య కేసులో ఏడు గురు క్రైస్తవులను దోషులుగా తెలుస్తూ ఒడిస్సా లోని న్యాయస్థానం తీర్పును వేలువడించింది .
కందమాల్ జిల్లా న్యాయస్థాన ప్రత్యేక అదనపు న్యాయమూర్తి శ్రీ RK తొస్ గారు తన తీర్పును ఒడిస్సా రాజధాని భువనేశ్వర్ కు సుమారు 200 KM దూరంలోఉన్న ఫుల్భాని న్యాయస్థానం లో వెల్లడిస్తూ శిక్షలను అక్టోబర్ 03 ణ ఖరారు చేస్తున్నట్ల్టు తెలిపారు .
2008 లో దాదాపు 50 మందితో కూడిన జన సముహముతో స్వామి లక్ష్మణానంద ఆశ్రమము పై దాడి చేసిన వారిలో దుర్యోధన్ సున మజ్హి , సనతాన్ బడ మజ్హి , గల్నాథ్ చలన్సేత్ , బ్రిజేయ్ కుమార్ సంసీ , భాస్కర్ కుమార్ మజ్హి మరియు భుధదేవ్ నాయక్ లను న్యాయస్థానం దోషులుగా తెల్చిందని, తమని స్వామి క్రైస్తవం నుండి హిందువులుగా మారమని బలవంతం చేసినందునే హత్య చేయమని వారు కోర్టుకు తెలిపారని న్యాయవాది మీడియా కు తెలిపారు .
2009 జనవరిలో నిందుతులపై పోలీసులు తోలి అభియోగా పత్రాన్ని నమోదు చేసారు , 2011 లో మరో ఇద్దరు మావోయిస్టు నాయకులు పొలారి రామా రావు , సవ్యసాచి పండా లను నిందితులగా చేరుస్తూ రెండో చార్జ్ షీట్ ను నమోదు చేసారు . రెండో చార్జ్ షీట్ లో తీర్పును మంగళవారం కోర్టు వెలువడించనుంది.


No comments:
Post a Comment