Our amazing new site will launch in

Monday, 5 August 2013

పశ్చిమాంద్ర ప్రాంత వర్షారంభ సమావేశాలు - హిందూ సమాజం లో విశుగీషు ప్రవృత్తి నిర్మాణం కావాలి మాన్య శ్రీ రాఘవ రెడ్డి జి

దిల్ శుక్ నగర్ , భాగ్యనగర్ : విశ్వ హిందు పరిషద్ పశ్చిమ ఆంద్ర ప్రదేశ్ ప్రాంత వర్షారంభ సమావేశాలు తేది 3 , 4 ఆగస్టు 2013 లలో భాగ్యనగర్ లోని  దిల్ శుక్ నగర్ శ్రీ పుల్లారెడ్డి స్మారకోన్నత పాఠశాలలో జరిగాయి , ఈ సమావేశాలకు జిల్లా స్థాయి మరియు ఆ పై స్థాయి అధికారాలు హాజరయ్యారు , మాన్య శ్రీ గోపాల్ జి  దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన మంత్రి రెండు రోజులు పూర్తిగా ఉండి మార్గదర్శనం చేసారు , సమారొహ్ లో మాన్య శ్రీ రాఘవ రెడ్డి గారు విశ్వ హిందు పరిషద్ అంతర్జాతీయ అధ్యక్షులు మార్గదర్శనం చేసారు.
అదికాధిక సమయం ఇవ్వడం ద్వారా మన లక్ష్యాలను సాధిద్దాం : మాన్య  శ్రీ గోపాల్ జి 
మాన్య శ్రీ  గోపాల్ జి సమావేశాల ఉద్గాటన కార్యక్రమంలో స్వర్ణ జయంతి లక్ష్యాల ముఖ చిత్రాన్ని  ఆహుతుల ముందు ఉంచుతూ " మనం వచ్చే సంవత్సరం స్వర్ణ జయంతి లోకి అడుగు పెట్టబోతున్నాం ఎందఱో త్యాగ ధనుల ధ్యాగల పునాదుల మీద నేడు పరిషద్ ప్రపంచంలోనే అది పెద్ద మరియు  అత్యదిక దేశాలలో ఉన్న సంఘటన గా రూపాంతరం చెందిది , వారి త్యాగ ఫలాలను నేడు  హిందు సమాజం అనుభవిస్తూ ఉంది , ఈ రోజున హిందువులు తమ తమ పండుగులను, ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు అంటే అది మన జేష్ఠ కార్యకర్తల నిరాడంబర , త్యాగమయ జీవన ఫలితమే . ఈ స్వర్ణ జయంతి సంవత్సరంలో మనం పరమ పూజ్య గురూజీ స్వప్నం హిందుత్వ జీవనం ఆధారంగా మన తల్లి భారతంబ పునర్వైభవ సాధన కై మళ్ళి ఒకసారి అంకితం కావాల్సిన సమయం వొచ్చింది . స్వామీ వివేకుడు అన్న ఆట్టాడుగు వాని ఇంటిలో భారతమాత ఉదయించాలి , మనం ప్రతి పల్లెకు చేరాలి  ప్రతి గుండెని కదిలించాలి , కేవలం హిందుత్వ జీవిన విధాన గొప్పతనం తెలియకనే మన వారు ప్రక్క చూపులు చూస్తున్నారు , నేడు ఈ దేశం ఎదుర్కుంటున్న అనేక సమశ్యలు పరిష్కారం కేవలం మనమే , దాని కోసం అధికాధిక సమయం ఇచ్చి పనిచేయాల్సిన ఆవసరం ఉంది , స్వర్ణ జయంతి లో పని చేసే అవకాశం రావడం మన పూర్వ జన్మ సుకృతం అని భావించాల్సిన ఆవసరం ఉంది ఈ సమయంలో ఒక సంవత్సరం పాటు దేశం కోసం , ధర్మం కోసం పూర్తీ సమయం ఇచ్చే కార్యకర్తలు ధన్య జీవులవుతారు " అంటూ వారిచ్చిన మార్గదర్శనం తో అందరి హృదయాలలో విశ్వ గురువు భారత మాత రూపం కదలాదిడింది .

ప్రాంత స్థాయిలో జరిగిన కార్యక్రమాల సమీక్షా - లక్ష్యాల నిర్ణయం   
మాన్య శ్రీ కేశవా రాజు gaar
మాన్య శ్రీ సురేందర్ రెడ్డి( ప్రాంత అధ్యక్షులు ) గారి అధ్యక్షతన జరిగిన సమీక్ష ను మాన్య గాళ్ రెడ్డి ప్రాంత కార్యదర్శి గారు నిర్వహించారు , గత సంవత్సర కాలంలో జరిగిన కార్యక్రమాలు వాటి అనువర్తి పై సుదీర్గంగా సమీక్ష జరిగింది అన్ని జిల్లాల కార్యదర్శులు నివేదికలు మరియు లక్ష్యాల ప్రతులను ప్రాంత కార్యదర్శి గారికి అందించడం జరిగింది , మాన్య కేశవరాజు గారు సంఘటన నిర్మాణ విషయమై జిల్లా కార్యదర్శులకు సూచనలు ఇస్తూ కార్యక్షేత్రం లో జరిగిన అనుభవాలను వివరించడం జరిగింది. మన ప్రాంత స్థాయిలో తర్వాత ప్రాంత స్థాయి నివేదికతో సమీక్షా సమావేశం ముగిసింది . 


హిందూ సమాజం లో విశుగీషు ప్రవృత్తి నిర్మాణం కావాలి : మాన్య శ్రీ రాఘవ రెడ్డి జి అంతర్జాతీయ అధ్యక్షులు 
మాన్య శ్రీ రాఘవ రెడ్డి గారు 
సమావేశాల సమారోహ కార్యక్రమానికి హాజరైన విశ్వ హిందు పరిషద్ అంతర్జాతీయ అధ్యక్షులు మాన్య శ్రీ రాఘవ రెడ్డి గారు తనదైన శైలిలో ప్రసంగిస్తూ " ఈ వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు లో బిల్లు పెట్టి చట్టం చేయడం ద్వారా అయోధ్య శ్రీ రామ జన్మ భూమిలో భవ్య రామ మందిర నిర్మాణానికి మార్గ సుగుమం చేయాలి లేని యడల  గౌహతి అస్సాం కేంద్రంగా జరిగిన పరిషద్ కేంద్రీయ ప్రబంధ సమితి బైటక్ లో నిర్ణయించిన ప్రకారం అయోధ్య శ్రీ రామ జన్మభుమిలో భవ్య మందిర నిర్మానర్థమై పరిషద్ మళ్ళి బృహత్తర ప్రజా ఉద్యమాన్ని నిర్మించబోతున్నది , దానికి దేశం లోని ప్రముఖ సాదు సంతులు న్యాయకత్వం వహించబోతున్నారు , దానిలో భాగంగానే దేశం లోని అన్ని ప్రాంతాల నుండి అయోధ్య పరిక్రమ యాత్ర జరుగబోతున్నది దీనిలో హిందు సమాజాన్ని రామ భక్తులను పూర్తీ స్థాయిలో పాల్గొనే విధంగా కార్యక్రమ ప్రణాళికను రూపొందించుకుని యాత్రను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను , నేడు ప్రపంచంలోని అన్ని మతాలూ తమ మతమే ప్రపంచాన్ని ఏలాలని కోరుకుంటూ ఆ దిశలో తమ కార్యాచరణను అమలు చేస్తున్నారు వారందరి లక్ష్యం కేవలం హిందు సమాజం , ఈ హిందు దేశం అన్న విషయం మనదరికి అవగతమే కాబట్టి హిందు సమాజం లో విశుగీషు ప్రవృత్తిని నిర్మాణం చేయాలి ఈ స్వర్ణ జయంతి సంవత్సరంలో మనం దేశంలో ఒక గొప్ప మార్పును తేబోతున్నాం సంఘటిత హైందవ శక్తి ముందు ముష్కర మూకల ఆటలు ఇంకేతో కాలం సాగలేవు , దానిని సాధించడం కోసం అత్యధిక సంఖ్యలో పుర్ణకాలిన , వానప్రస్తి కార్యకర్తలు అవసరం ఉన్నది దేశ మాత తన కోసం పనిచేసే ప్రియ పుత్రుల కోసం ఎదురు చూస్తూ ఉంది ఆ సౌభాగ్యాన్ని ఎవరు విడిచి పెట్టొద్దు.  జై శ్రీ రాం " అని అన్నారు .       


 పాల్గొన్న ప్రతినిధులు 



  
           

No comments:

Post a Comment

About Me

Powered by Blogger.

Blog Archive

Contact us

Name

Email *

Message *

Top Ad unit 728 × 90

Disqus Shortname

Comments system

Ad Inside Post

వార్తా - హైందవం

News

Contact Form

Name

Email *

Message *

Purchasing Code

Home PageNav

PageNav Posts Number

Scroll Animation

Boxed Style