Our amazing new site will launch in

Monday, 26 August 2013

వెల్లువెత్తిన హిందూ ప్రభంజనం : రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ నిర్వాకానికి వ్యతిరేకంగా ధర్నాలు , నిరసనలు

  • రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన తెలిపిన విహిప నేతృత్వం లో  హిందూ సమాజం, రాష్ట్రం లోని అన్ని జిల్లాల ముఖ్య పరిపాలన కార్యాలయ ముందు ధర్నాలు 
  • 'గత 1000 సంవత్సరాలుగా యాత్ర కొనసాగుతుంది , ఎవ్వరు అడ్డుకోలేరు ' రాజ్ భవన్ ముందు ధర్నా లో మాన్య శ్రీ వై రాఘవులు
  • 'హిందూ సమాజ ధార్మిక శక్తి ముందు ప్రభుత్వ నిర్భందం తలవంచక తప్పదు' - సుధాంశు మోహన్ పట్నాయక్    


విజయశ్రీ భవన్, కోటి , భాగ్యనగర్ 26/08/2013 : " అయోధ్యజి హమ్ ఆఎంగ్యే " అని నినదిస్తూ దేశం లోని ప్రముఖ ధర్మాచార్యుల నేతృత్వంలో నిర్వహించతలపెట్టిన 84-కోసి అయోధ్య పరిక్రమ యాత్ర పై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం హిందువుల మౌళిక మరియు రాజ్యాంగబద్ధ ప్రాథమిక హాక్కులను కాలరాస్తూ విధించిన అక్రమ నిషేదాన్ని వ్యతిరేకిస్తూ , యాత్ర ప్రారంభం సందర్భంగా ధర్మాచార్యుల పై మరియు విశ్వ హిందూ పరిషద్ నాయకులపై జరిపిన దౌర్జన్యపూరిత దాడిని , నిర్భందాన్ని వ్యతిరేకిస్తూ , మాన్య శ్రీ ప్రవీణ్ భాయి తొగాడియా ఇచ్చిన పిలుపులో భాగంగా హిందూ సమాజం తన శక్తి ప్రదర్శన చేసింది , రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల ప్రధాన పరిపాలన కార్యాలయాలు మరియు అన్ని సహా పరిపాలన కార్యాలయాల ముందు జరిగిన ధర్నా, నిరసన కార్యక్రమాలలో హిందూ సమాజం పెద్ద ఎత్తున పాల్గొని ' హిందూ సాధువులపై జరిగే దౌర్జన్యాన్ని సహించేది లేదు ' అని నినదించారు . రాష్ట్ర వ్యాప్తంగా 50 కేంద్రాలలో సుమారు 10000 మంది మంది ధర్నాలలో పాల్గొన్నారు .

రాష్ట్ర స్థాయిలో భాగ్యనగర్ లో రాజ్ భవన్ ముందు జరిగినధర్నా లో సుమారు 3500 మంది రామ భక్తులు పాల్గొన్నారు , గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో గవర్నర్ వ్తక్తిగత కార్యదర్శికి విజ్ఞాపన పత్రం అందిచడం జరిగింది. ఈ సందర్భంగా మాన్య శ్రీ వై రాఘవులు గారు ( అంతర్జాతీయ సంయుక్త  కార్యదర్శి విశ్వ హిందూ పరిషద్ ) మాట్లాడుతూ " గత 1000 సంవత్సరాలుగా ధార్మిక పరంపరలో భాగంగానే 84-కోసి అయోధ్య పరిక్రమ యాత్ర నిర్వహించబడుతుంది , ఈ యాత్ర కేవలం ఈ ఏడూ మాత్రమె ఆయోజితం అయినది కాదు , కేవలం రాజకీయ లబ్ది కోసం మాత్రమె ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం , ఒక వర్గానికి అనుకూలంగా ప్రవర్తిస్తూ కర్కశంగా ఈ పరిక్రమ పై నిషేధం విధించింది , ధర్మాచార్యులను నిర్భందించింది , కనీసం భారత రాజ్యాంగం కలిపించిన మౌలిక హాక్కులను కూడా యుపి ప్రభుత్వం  నిలబెట్టలేక పోయింది , దేశ వ్యాప్తంగా ఇంత ప్రతిక్రియ వ్యక్తం అయిన తర్వాత కూడా ప్రభుత్వం ఈ ధార్మిక యాత్ర పై నిషేధం ఎత్తివేయకపోతే సాదు సంతుల ధర్మాగ్రనికి గురి కాకతప్పదు" అని అన్నారు ,    
తదననతరం మాన్య శ్రీ సుధాంశు మోహన్ పట్నాయక్ ( దక్షిణ భారత సంఘటన మంత్రి ) మాట్లాడుతూ " కేవలం హిందుత్వాన్ని వ్యతిరేకించడమే లౌకికవాదం గా మారింది , వోటు బ్యాంకు రాజకియలకోసం ప్రభుత్వాలు హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్నాయి ఇక ఇది ఎంత మాత్రము సహన యోగ్యము కాదు , ఈ నిర్భందాలు , ధర్మాచార్యుల పట్ల అగౌరవకరమైన ప్రవర్తన ఎంతమాత్రము సమ్మతముకాదు , హిందూ సమాజం ఈ పరిణామాలను గమనిస్తూ ఉంది , కేవలం ప్రతి రోజు 150-200 మంది సాధువులు ధార్మిక మార్గంలో పాదయాత్ర చేస్తే ఘర్షణలు ఏర్పడతాయ ? దేశం లోని హిందువులు లౌకికవాదులు , సహనశీరులు కాబట్టే ఈ దేశం లో అత్యదిక ప్రాంతాలలో ఘర్షణవాతావరణం  లేదు హిందువులు అల్పసంఖ్యకులుగా ఉన్న ప్రాంతాలలోనే  ఘర్షణలు అధికంగా జరుగుతున్నాయి ఇది నిజం కాదా ? అని నేను అకిలేష్ యాదవ్ నిన్ను ప్రశ్నిస్తున్నాను " అని అన్నారు ,
ఈ కార్యక్రమంలో మాన్య శ్రీ గోపాల్ జి ( దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన మంత్రి ) మాన్య శ్రీ రామ రాజు గారు ( ప్రాంత అధ్యక్షులు ) , మాన్య శ్రీ సురేందర్ రెడ్డి( ప్రాంత కార్యదక్షులు ) , మాన్య శ్రీ మాధవ్ రెడ్డి గారి గాల్ రెడ్డి ( ప్రాంత కార్యదర్శి)  , అధిక సంఖ్యలో విహిప నాయకులు , కార్యకర్తలు , రామ భక్తులు పాల్గొన్నారు .

Saturday, 24 August 2013

"అయోధ్య పరిక్రమ కేవలం సాధువుల ధార్మిక యాత్ర మాత్రమె ! ఆందోళన కార్యక్రమం కాదు" - శాంతికై విశ్వ హిందు పరిషద్ విజ్ఞప్తి


  • ' అయోధ్య 84 కోసి పరిక్రమ యాత్ర కేవలం సాధువుల ధార్మిక పాదయాత్ర మాత్రమె , నిరసన లేదా రాజకీయ కార్యక్రమం కాదు' - స్పష్టం చేసిన విశ్వ హిందూ పరిషద్ 
  • ' అయోధ్య లో శాంతియుత వాతారణాన్ని కల్పించండి , ధర్మాచార్యులను అగౌరవపరచకండి' - మాన్య డా . ప్రవీణ్ తొగాడియా విజ్ఞప్తి   
ఫైల్ ఫోటో 

న్యు డిల్లి , 24/08/2013 : దేశం లోని ప్రముఖ ధర్మాచార్యుల ద్వారా నిర్వహించబడుతున్న ' అయోధ్య జి  84 కోసి పరిక్రమ యాత్ర ' ను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నిషేదించడం పై విశ్వ హిందూ పరిషద్ తీవ్ర అసంతృప్తిని , వేదనను వ్యక్తం చేసింది . ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషద్ అంతర్జాతీయ కార్యదక్షులు మాన్య డా తొగాడియా యాత్ర స్వభావాన్ని వివరిస్తూ ' ఇది కేవలం దేశం లోని ప్రముఖ ధర్మాచార్యుల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ధార్మిక పాదయాత్ర మాత్రమె , ఇందులో ఎలాంటి వివాదాస్పద అంశాలకు తావు లేదు , కాని ఆశ్చర్యకరంగా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఈ యాత్రను నిషేదించడం , 144 సెక్షన్ ను విధించడం సహేతుకంగా లేదు , ఇప్పటికే 100 మందికి పైగా ధర్మాచార్యులను , అనేక మంది విశ్వ హిందూ పరిషద్ కార్యకర్తలను అరెస్టు చేయడం జరిగింది. దీని పట్ల విహిప తీవ్ర దిద్భ్రాంతిని వ్యక్తం చేస్తుంది , నేను మాన్య అఖిలేష్ యాదవ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి హిందువుల మనోభావాలను గౌరవించండి , అరెస్టైన సాదు సంతులను అగౌరవపరిచే చర్యలు మానుకోండి ' అని అన్నారు. అందులోని అంశాలు క్రింది విధంగా ఉన్నాయి .

  1.  అయోధ్యాజి 84 కోసి పరిక్రమ యాత్ర  ప్రసార మధ్యమాలోని కొంత భాగం మరియు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం చుపుతున్నట్ల్టుగా రాజకీయ కార్యక్రమమో లేదా నిరసన కార్యక్రమమో కాదు , ధర్మాచార్యుల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సాంస్కృతిక పాద యాత్ర మాత్రమె .
  2. తేది 25 ఆగస్టు 2013 ప్రారంభమై తేది 15 సెప్టెంబర్ 2013 తో ముగిసే ఈ యాత్ర లో ప్రతి రోజు కేవలం 150 - 200 మంది సాధువులు , ధర్మాచార్యులు మాత్రమె పరిక్రమ యాత్ర కేంద్రాల వద్ద పాల్గొంటారు ..
  3. నియమిత సంఖ్యలో ధర్మాచార్యులు పాల్గొంటూ నిర్వహించబడుతున్న ధార్మిక పరిక్రమ యాత్ర పట్ల ప్రభుత్వం చూపుతున్న భీతికి కారణం లేదు .
Source : www.samvada.org


    Thursday, 22 August 2013

    VHP dares The Yatra Ban; says ‘The 84-Kosi Parikrama of Ayodhya would take place as scheduled’

    The 84-Kosi Parikrama of Ayodhya would take place as scheduled! U.P. Government should review its decision of crushing the 84-Kosi Ayodhya Parikrama of Sants and seers coming from all over the country, otherwise Hindus should remain ready for a peaceful and democratic struggle’   – Ashok Singhal, Patron, VHP

    New Delhi, Aug. 20, 2013 – On August 17Sat, 2013, post-meet of the Sri Rama Janma Bhumi Temple Construction Sant High-Power Committee, an 11-member Sant Delegation called on Sri Mulayam Singhji Yadav and the Chief Minister of Uttar Pradesh Sri Akhilesh Singhji at their residence in Lucknow. The conversation with Sri Mulayam Singhji continued for about two hours. Sri Mulayam Singhji dropped hints that the Sants should call off the scheduled 84-Kosi Yatra in view of the aggressive designs of China and Pakistan. On there being no comment on this from the Sants, he said that the 84-Kosi Yatra tithis (dates) are fixed, this Yatra takes place in the month of Chaitra, and, therefore, no new tradition could be initiated. On this the Jagadguru Ramanandacharya Ven. Swami Rambhadracharyaji Maharaj made it clear that the 84-Kosi Yatra is a tradition that has been there for thousands of years with the belief that it gives deliverance to the performer from the cycle of 84-Lakh Yonis. Just as the Kamadgiri Parikrama at Chitrakoot, Govardhan Hill Parikrama at Braj Mandal, 84-Kosi Parikrama of Braj Kshetra and the Thiruvannamalai Parikrama of the Sacred Arunachala Hill in South India can be undertaken at any time of the year and no specific time-frame is fixed for it, similarly the 84-Kosi Parikrama of Ayodhya can also be undertaken at any time of the year.

    Sri Mulayam Singhji told the delegation that he would make efforts, after consultations with the local authorities, so that the Yatra could take place. At no point during the conversation did the delegation have an inkling that he was against this Yatra or that any sort of ban would be imposed on it. The Sants were fully confident that this Yatra would be undertaken peacefully. But yesterday’s Government notification was surprising as to the barrier that came in between that compelled overnight Sri Mulayam Singhji and the Chief Minister of U.P. for a volte-face and change of mind and in order to stop this Yatra they clamped Section 144 of the Criminal Procedure Code (CrPC) to prohibit assembly of people in all those districts around Ayodhya that host the progressive legs of the 84-Kosi Parikrama (Circumambulation). This decision of the Government is not only unfortunate but also one of tyranny on the Hindu society with a view to playing to the gallery of Muslim Vote Bankers. There is not an iota of doubt in it that they are out to crush Hindu feelings only under pulls and pressures from the Muslim leaders entrenched in their own party.

    Sri Mulayam Singhji and the Congress leaders have been telling it again and again that the court’s verdict should be awaited. When the Court verdict after 60 years has already come that where Sri Ram Lala is Virajman today that is His Birthplace, it was the duty of Sri Mulayam Singhji to mobilize the Muslim religious leaders to honour and materialize their word to “…voluntarily hand over the…” Sri Rama Janma Bhumi (Ayodhya) “…shrine to the Hindus” (vide Paras 2.1, 2.2 and 2.3 of the White Paper of Government of India). Instead of doing this, Sri Mulayam Singhji’s move to oppose and oppress the Yatra is not only a violation of the Constitutional rights of Hindus but a gag and betrayal of the Hindu society. The Hindu society is no longer ready to tolerate it. This Dharmic Yatra is being undertaken by the Sants and seers coming from all the States of the country. This circumambulatory pilgrimage would take place as scheduled as it is the directive of the Sant Fraternity.

    We would request Sri Mulayam Singhji Yadav and the Chief Minister of U.P. Sri Akhilesh Yadavji that before going ahead armed with their state machinery to crush the Dharmic feelings of the Sant Fraternity they should review their decision. If they do not do this then the Hindu society, in order to defend its rights, should remain ready to wedge a struggle through peaceful and democratic way. 

    Monday, 19 August 2013

    Govt bans VHP’s Yatra, VHP strongly reacts; says ‘Ban Violates Fundamental Religious Rights’.

    New Delhi Aug 19: In a move which received huge resistance from Sanghparivar, Uttar Pradesh Government had banned the most expected Ayodhya Ram Mandir related ‘Parikrama Yatra’ of Vishwa Hindu Parishad in Uttar Pradesh.

    The yatra was scheduled from August 25 to September 13 of 2013, aiming for the construction of Ram Mandir at Ayodhya, the birthplace f Lord Ram.

    VHP already took initiatives for the Yatra and the preparations were in the final stage. The decision of Yatra was taken in sevral discussions involving sevral Religious heads, Saints and socio-religious leaders at VHP’s national meet held at Prayag and Haridwar, earlier. Now the Ban on yatra has sparked utmost resistance from the Sanghparivar.
        Reacting strongly on Govt’s ban, VHP international President Dr Pravin Togadia said “UP Govt prohibiting Hindus from going on Ayodhya Parikrama violates fundamental religious rights. Our Saints to decide future course of action. UP Govt with Mulayamji CM had banned Hindus from going to Ayodhya Oct 2003, brutally lathicharged Hindus& abducted me to forest Guest house. In October 2003, UP govt then stoppped the trains to Ayodhya arriving from all parts of Bharat. From Amarnath to Ayodhya it is same attitude of all parties
    Sorce : www.samvada.org

    మిత్యాతాండా (నల్గొండ) లో 85 కుటుంబాల నుండి 445 మంది క్రైస్తవం నుండి తిరిగి హిందూ ధర్మ స్వీకరణ

    తేది 15/08/2013, నల్గొండ జిల్లా , అడవిదేవరపల్లి మండలము :శ్రీ బాలు స్వామీ , శ్రీ ఉపేందర్ ల సంయుక్త ఆధ్వర్యంలో  నల్గొండ జిల్లా అడవిదేవర పల్లి మండలము మిత్యా తాండా లో జరిగిన పునరాగమణ కార్యక్రమంలో  చుట్టూ ప్రక్కల ఐదు తండాలకు చెందిన 85 కుటుంబాల నుండి 445 మంది సభ్యులు కైస్తవ మతం నుండి తిరిగి హిందు ధర్మాన్ని స్వీకరించారు .  
    ఈ కార్యక్రమం లో మాన్య శ్రీ గుమ్మల్ల సత్యం కేంద్ర సహా కార్యదర్శి విశ్వ హిందు పరిషద్ మార్గ దర్శనం చేస్తూ " భారత జాతి మూల వాసులైన గిరిజనులే చరిత్రలో హిందు దర్మం పై మహమ్మదీయుల దాడులు జరిగినప్పుడు ఎదురుతిరిగి పోరాడి తమ ప్రాణాలు సైతం త్యాగం చేసి హిందుత్వాన్ని కాపాడారు మీరు చరితార్త్రులు , మీలోని అమాయకత్వం , త్వరగా నమ్మే గుణం కారణంగా నేడు క్రైస్తవులు సులంభంగా తమ వైపు ఆకర్షించుకోగాల్గుతున్నారు , కాని నిప్పులాంటి మిమ్మల్ని వారు ఎంతో సేపు మబ్య పెట్టలేక పోయారు , బిర్సా ముందా , సెవాలాల్ మహరాజ్ వంటి హైందవ యోధులైన మీ పూర్వీకుల రక్తం మీలో ఉన్నంత వరకు హిందుత్వానికి డోకా లేదు , తిరిగి అమ్మ వోడికి చేరిన మీ అందనరికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను " అని అన్నారు .  
    ఈ కార్యక్రమంలో విశ్వ హిందు పరిషద్ ధర్మ ప్రసార సమితి ప్రాంత అధ్యక్షులు మాన్య శ్రీ ఎల్లయ్య గారు , ఉపాధ్యక్షులు శ్రీ బుచ్చయ్య గారు , కోశాధికారి శ్రీ రామేష్ గారు , తదితరులు పాల్గొన్నారు . పునరాగానం చెందిన కుటుంబాలకు క్రొత్త బట్టలు , శ్రీ రాముని పొటోలు అందిచబడ్డాయి.

    Sunday, 18 August 2013

    Press Release : ఉద్యమాల పేరిట తిరుమల భక్తులను అడ్డుకోవడం శోచనీయం - శ్రీ రామ రాజు ప్రాంత అద్యక్షులు

    పత్రిక ప్రకటన 
    విశ్వ హిందు పరిషద్ - ఆంద్ర ప్రదేశ్ 

    ప్రజాస్వామ్య పద్దతిలో నిరసనలు చేయడం , ఉద్యమాలు నిర్వహించడం ప్రతి ఒక్కరి హక్కు అయిన్నప్పటికి గత రెండు రోజులుగా తిరుమల తిరుపతి వద్ద చోటుచేసుకుంటున్న సంఘటనలు చూస్తె హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచే విధంగా ఉన్నాయి .
    కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల్ శ్రీ వేంకటేశ్వరుని దర్శనానికి ప్రతినిత్యం దేశ నలుమూలల నుండే కాకుండా ప్రపంచా వ్యాప్తంగా ఉన్న హిందువులు లక్షలాదిగా వస్తుంటారు , వారందరినీ సేవ చేసే భాగ్యాన్ని ఆ స్వామివారు తిరుమల తిరుపతి వాసులకు కలిపించిన విషయాన్ని ఆందోళనకారులు గుర్తించాలని కోరుతున్నాం .
    పుణ్య క్షేత్రాలను ఆందోళన పరిది నుండి మినహాహించాలని , రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలను వెంటనే తీసుకోవాలని విశ్వ హిందు పరిషద్ కోరుతుంది . ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్న రాజకీయ పార్టీల నేతలు , వివిధ సంఘాల ప్రతినిధులు కుడా పుణ్య క్షేత్రాల వద్ద ఆందోళనలు నిర్వహించకుండా తమ శ్రేనుకలు పిలుపునిచ్చి హిందువుల మనోభావాలు గాయపడకుండా వ్యవహరించాలని విశ్వ హిందు పరిషద్ కోరుతుంది . 
    ఆందోళన కారుల ముసుగులో కొన్ని హిందు వ్యతిరేక శక్తులు , సంస్థలు కుడా తిరుమల భక్తుల పట్ల అనుచితంగా వ్యవహరిస్తూ తిరుమల తిరుపతి పవిత్రతను దేబ్బదియడానికి ప్రయత్నం చేతున్నారు , వెంటనే పోలీసులు తగిన చర్యలు తీసుకుని తిరుమల్ తిరుపతి పవిత్రతను కాపాడాలని , లేని పక్షంలో హిందువుల ఆగ్రహానికి గురి కావాల్సివస్తుందని హేచ్చారిస్తున్నాము .
    భవదీయ       

    రామ రాజు        
    ప్రాంత అధ్యక్షులు 


    Monday, 5 August 2013

    పశ్చిమాంద్ర ప్రాంత వర్షారంభ సమావేశాలు - హిందూ సమాజం లో విశుగీషు ప్రవృత్తి నిర్మాణం కావాలి మాన్య శ్రీ రాఘవ రెడ్డి జి

    దిల్ శుక్ నగర్ , భాగ్యనగర్ : విశ్వ హిందు పరిషద్ పశ్చిమ ఆంద్ర ప్రదేశ్ ప్రాంత వర్షారంభ సమావేశాలు తేది 3 , 4 ఆగస్టు 2013 లలో భాగ్యనగర్ లోని  దిల్ శుక్ నగర్ శ్రీ పుల్లారెడ్డి స్మారకోన్నత పాఠశాలలో జరిగాయి , ఈ సమావేశాలకు జిల్లా స్థాయి మరియు ఆ పై స్థాయి అధికారాలు హాజరయ్యారు , మాన్య శ్రీ గోపాల్ జి  దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన మంత్రి రెండు రోజులు పూర్తిగా ఉండి మార్గదర్శనం చేసారు , సమారొహ్ లో మాన్య శ్రీ రాఘవ రెడ్డి గారు విశ్వ హిందు పరిషద్ అంతర్జాతీయ అధ్యక్షులు మార్గదర్శనం చేసారు.
    అదికాధిక సమయం ఇవ్వడం ద్వారా మన లక్ష్యాలను సాధిద్దాం : మాన్య  శ్రీ గోపాల్ జి 
    మాన్య శ్రీ  గోపాల్ జి సమావేశాల ఉద్గాటన కార్యక్రమంలో స్వర్ణ జయంతి లక్ష్యాల ముఖ చిత్రాన్ని  ఆహుతుల ముందు ఉంచుతూ " మనం వచ్చే సంవత్సరం స్వర్ణ జయంతి లోకి అడుగు పెట్టబోతున్నాం ఎందఱో త్యాగ ధనుల ధ్యాగల పునాదుల మీద నేడు పరిషద్ ప్రపంచంలోనే అది పెద్ద మరియు  అత్యదిక దేశాలలో ఉన్న సంఘటన గా రూపాంతరం చెందిది , వారి త్యాగ ఫలాలను నేడు  హిందు సమాజం అనుభవిస్తూ ఉంది , ఈ రోజున హిందువులు తమ తమ పండుగులను, ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు అంటే అది మన జేష్ఠ కార్యకర్తల నిరాడంబర , త్యాగమయ జీవన ఫలితమే . ఈ స్వర్ణ జయంతి సంవత్సరంలో మనం పరమ పూజ్య గురూజీ స్వప్నం హిందుత్వ జీవనం ఆధారంగా మన తల్లి భారతంబ పునర్వైభవ సాధన కై మళ్ళి ఒకసారి అంకితం కావాల్సిన సమయం వొచ్చింది . స్వామీ వివేకుడు అన్న ఆట్టాడుగు వాని ఇంటిలో భారతమాత ఉదయించాలి , మనం ప్రతి పల్లెకు చేరాలి  ప్రతి గుండెని కదిలించాలి , కేవలం హిందుత్వ జీవిన విధాన గొప్పతనం తెలియకనే మన వారు ప్రక్క చూపులు చూస్తున్నారు , నేడు ఈ దేశం ఎదుర్కుంటున్న అనేక సమశ్యలు పరిష్కారం కేవలం మనమే , దాని కోసం అధికాధిక సమయం ఇచ్చి పనిచేయాల్సిన ఆవసరం ఉంది , స్వర్ణ జయంతి లో పని చేసే అవకాశం రావడం మన పూర్వ జన్మ సుకృతం అని భావించాల్సిన ఆవసరం ఉంది ఈ సమయంలో ఒక సంవత్సరం పాటు దేశం కోసం , ధర్మం కోసం పూర్తీ సమయం ఇచ్చే కార్యకర్తలు ధన్య జీవులవుతారు " అంటూ వారిచ్చిన మార్గదర్శనం తో అందరి హృదయాలలో విశ్వ గురువు భారత మాత రూపం కదలాదిడింది .

    ప్రాంత స్థాయిలో జరిగిన కార్యక్రమాల సమీక్షా - లక్ష్యాల నిర్ణయం   
    మాన్య శ్రీ కేశవా రాజు gaar
    మాన్య శ్రీ సురేందర్ రెడ్డి( ప్రాంత అధ్యక్షులు ) గారి అధ్యక్షతన జరిగిన సమీక్ష ను మాన్య గాళ్ రెడ్డి ప్రాంత కార్యదర్శి గారు నిర్వహించారు , గత సంవత్సర కాలంలో జరిగిన కార్యక్రమాలు వాటి అనువర్తి పై సుదీర్గంగా సమీక్ష జరిగింది అన్ని జిల్లాల కార్యదర్శులు నివేదికలు మరియు లక్ష్యాల ప్రతులను ప్రాంత కార్యదర్శి గారికి అందించడం జరిగింది , మాన్య కేశవరాజు గారు సంఘటన నిర్మాణ విషయమై జిల్లా కార్యదర్శులకు సూచనలు ఇస్తూ కార్యక్షేత్రం లో జరిగిన అనుభవాలను వివరించడం జరిగింది. మన ప్రాంత స్థాయిలో తర్వాత ప్రాంత స్థాయి నివేదికతో సమీక్షా సమావేశం ముగిసింది . 


    హిందూ సమాజం లో విశుగీషు ప్రవృత్తి నిర్మాణం కావాలి : మాన్య శ్రీ రాఘవ రెడ్డి జి అంతర్జాతీయ అధ్యక్షులు 
    మాన్య శ్రీ రాఘవ రెడ్డి గారు 
    సమావేశాల సమారోహ కార్యక్రమానికి హాజరైన విశ్వ హిందు పరిషద్ అంతర్జాతీయ అధ్యక్షులు మాన్య శ్రీ రాఘవ రెడ్డి గారు తనదైన శైలిలో ప్రసంగిస్తూ " ఈ వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు లో బిల్లు పెట్టి చట్టం చేయడం ద్వారా అయోధ్య శ్రీ రామ జన్మ భూమిలో భవ్య రామ మందిర నిర్మాణానికి మార్గ సుగుమం చేయాలి లేని యడల  గౌహతి అస్సాం కేంద్రంగా జరిగిన పరిషద్ కేంద్రీయ ప్రబంధ సమితి బైటక్ లో నిర్ణయించిన ప్రకారం అయోధ్య శ్రీ రామ జన్మభుమిలో భవ్య మందిర నిర్మానర్థమై పరిషద్ మళ్ళి బృహత్తర ప్రజా ఉద్యమాన్ని నిర్మించబోతున్నది , దానికి దేశం లోని ప్రముఖ సాదు సంతులు న్యాయకత్వం వహించబోతున్నారు , దానిలో భాగంగానే దేశం లోని అన్ని ప్రాంతాల నుండి అయోధ్య పరిక్రమ యాత్ర జరుగబోతున్నది దీనిలో హిందు సమాజాన్ని రామ భక్తులను పూర్తీ స్థాయిలో పాల్గొనే విధంగా కార్యక్రమ ప్రణాళికను రూపొందించుకుని యాత్రను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను , నేడు ప్రపంచంలోని అన్ని మతాలూ తమ మతమే ప్రపంచాన్ని ఏలాలని కోరుకుంటూ ఆ దిశలో తమ కార్యాచరణను అమలు చేస్తున్నారు వారందరి లక్ష్యం కేవలం హిందు సమాజం , ఈ హిందు దేశం అన్న విషయం మనదరికి అవగతమే కాబట్టి హిందు సమాజం లో విశుగీషు ప్రవృత్తిని నిర్మాణం చేయాలి ఈ స్వర్ణ జయంతి సంవత్సరంలో మనం దేశంలో ఒక గొప్ప మార్పును తేబోతున్నాం సంఘటిత హైందవ శక్తి ముందు ముష్కర మూకల ఆటలు ఇంకేతో కాలం సాగలేవు , దానిని సాధించడం కోసం అత్యధిక సంఖ్యలో పుర్ణకాలిన , వానప్రస్తి కార్యకర్తలు అవసరం ఉన్నది దేశ మాత తన కోసం పనిచేసే ప్రియ పుత్రుల కోసం ఎదురు చూస్తూ ఉంది ఆ సౌభాగ్యాన్ని ఎవరు విడిచి పెట్టొద్దు.  జై శ్రీ రాం " అని అన్నారు .       


     పాల్గొన్న ప్రతినిధులు 



      
               

    About Me

    Powered by Blogger.

    Blog Archive

    Contact us

    Name

    Email *

    Message *

    Top Ad unit 728 × 90

    Disqus Shortname

    Comments system

    Ad Inside Post

    వార్తా - హైందవం

    News

    Contact Form

    Name

    Email *

    Message *

    Purchasing Code

    Home PageNav

    PageNav Posts Number

    Scroll Animation

    Boxed Style