'మత మర్పిడ్ల పట్ల ఇన్ని సంవత్సారాలుగా మౌనంగా ఉన్న పార్టీలకు, వ్యక్తులకు ఇప్పుడు మాట్లాడే హక్కు లేదు, అమాయకత్వంలో ప్రలోభాలకు, భయానికి లోనై దారి తప్పిన మా సోదరులు తిరిగి హిందుత్వంలోనికి వస్తే తప్పా ?, ఇది దొంగే "దొంగా-దొంగా" అని అరచిన వైనాన్ని తలపిస్తుంది. - మోహన్ జి భాగవత్
22/12/2014, కోల్ కత్తా : " ఘర్ వాపసి " లేదా " పునరాగమన కార్యక్రమం ద్వారా మతం మారిన హిందువులను తిరిగి హిందుత్వం లోనికి తీసుకొచ్చే కార్యక్రమం కొనసాగితీరుతుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పూజ్య సర్ సంఘ్ చాలక్ మాన్య శ్రీ మోహన్ రావ్ జి భాగవత్ పుణరుద్గాటించారు, పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కత్తా లో విశ్వ హిందు పరిషద్ స్వర్ణ జయంతి ఉత్సవాలలో భాగంగా జరిగిన ర్యాలి లో ఆయన ప్రసంగించారు.ఎవరైతే " ఘర్ వాపసి " కార్యక్రమం జరగొద్దు అని భావిస్తున్నారో అలాంటి వ్యక్తులు పార్టీలు మత మర్పిడ్ల నిరోధ చట్టం కోసం పోరాడాలని ఆయన సూచించారు.
![]() |
| విహెచ్పి ర్యాలిలో ప్రసంగిస్తున్న రా.స్వ.స చీఫ్ మోహన్ భాగవత్ |
మత మార్పిడ్ల నిరోధ చట్టానికి మద్దతు తెలుపుతున్నాం : ప్రవీణ్ భాయి తొగాడియా
విశ్వ హిందు పరిషద్ అంతర్జాతీయ కార్యదక్షులు మాన్య శ్రీ ప్రవీణ్ భాయి తొగాడియా మాన్య సర్ సంఘ్ చాలక్ మోహన్ జి తో ఏకీభవిస్తూ " ప్రియ సహోదర (ములాయం సింగ్ యాదవ్) "ఘర్ వాపసి" ని దొంగతనంతో పోల్చావు కదా , దొంగకు చట్ట పరమైన శిక్షలు ఉన్నపుడు, కేంద్రం మత మర్పిడ్లను నిరోదించే చట్టం తెద్దామంటే ఎందుకు మద్దత్తు పలకట్లేదో ప్రజలకు సమాదానం ఇవ్వాల్సి ఉంటుంది జాగ్రత్తా ! " అని అన్నారు.


No comments:
Post a Comment