Our amazing new site will launch in

Monday, 13 October 2014

కరసేవకుల బలిదానాన్ని వృదా కానివ్వం : భజరంగ్ దళ్ తీర్మానం

హరిద్వార్ , 14/10/2014 : హరిద్వార్ లోని శ్రీ ప్రేమనగర్ ఆశ్రమం లో నిర్వహించబడుతున్న భజరంగ్ దళ్ జాతీయ స్థాయి సమావేశాల్లో అయోధ్య శ్రీ రామ జన్మభూమి మందిర ఉద్యమంలో అమరులైన కర సేవకుల కుటుంబాలను సత్కరించడం జరిగింది.
మూడు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాలలో దేశంలోని 42 ప్రాంతాలకు చెందిన భజరంగ్ దళ్ జిల్లాల మరియు విభాగ్ ల సంయోజకులు రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొన్నారు. అనేక మంది విశ్వ హిందు పరిషద్ జాతీయ నాయకులు ఈ సమావేశాలకు మార్గ దర్శనం చేసారు, కార్యక్రమ ముగింపులో జరిగిన శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది.
ముగింపు సమావేశంలో భజరంగ్ దళ్ జాతీయ సంయోజకులు శ్రీ రాజేష్ పండి గారు మాట్లాడుతూ ' అయోధ్య శ్రీ రామ జన్మ భూమిలో భవ్య శ్రీ రామ మందిరం నిర్మించి తీరుతాం, దేశంలోని మరెక్కడా కూడా బాబర్ పేరుతొ నిర్మాణాలను సహించేది లేదు, ఏ పవిత్ర లక్ష్య సాధనలో భాగంగా కరసేవ రోజున తమ ప్రాణాలను సహితం తృణప్రాయంగా భావించి రామ కార్యంలో బలిదానం అయిన మన సహోదరులు మన మార్గదర్శకుల త్యాగం వృదా కావడానికి వీల్లేదు, వీర హనుమాన్ వారసుల వలె మనం రామ కార్యంలో మున్డుందాం ' అని అన్నారు

Monday, 6 October 2014

ఆదోని: గోవధను అడ్డుకున్న భజరంగ్‌దళ్ కార్యకర్తలు - ప్రతిగ విహెచ్పి కార్యాలయం పై రాళ్ళ దాడి


ఆదోని, అక్టోబర్ 5: రాస్తారోకోలు, ఆందోళనలు, రాళ్లదాడితో కర్నూలు జిల్లా ఆదోని పట్టణం ఆదివారం అట్టుడికింది. సోమవారం నాటి పండుగ సందర్భంగా ఓవర్గం వారు తరలిస్తున్న గోవులను భజరంగ్‌దళ్ కార్యకర్తలు అడ్డుకుని పోలీసుల సాయంతో గోశాలకు తరలించడం ఉద్రిక్తతకు కారణమైంది. దీంతో ఆ వర్గంవారు పట్టణంలోని విహెచ్‌పి కార్యాలయంపై రాళ్లు రువ్వారు. దీంతో కార్యాలయం అద్దాలు ధ్వంసమయ్యాయి. దీనికి ప్రతిగా విహెచ్‌పి, భజరంగ్‌దళ్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వీరిపై ఓ వర్గం వారు రాళ్లురువ్వడంతో ప్రతిగా వీర రాళ్లు విసిరారు. వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం జరిగే పండుగ సందర్భంగా వధించేందుకు తీసుకువెళ్తున్న గోవులను స్థానిక భజరంగ్‌దళ్ కార్యకర్తలు అడ్డుకుని పోలీసుల సాయంతో గోశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న ఆ వర్గం వారు ఊరేగింపుగా టూటౌన్ పోలీసుస్టేషన్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు. మాంసం కోసం తెచ్చిన ఆవులను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. డిఎస్పీతో మైనారిటీ నాయకులు వాగ్వివాదానికి దిగారు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ శివరామిరెడ్డి హామీ ఇవ్వడంతో శాతించిన వారు నినాదాలు చేస్తూ ఊరేగింపుగా కదిలారు. ఇంతలో విశ్వహిందూపరిషత్ కార్యాలయం రావడంతో దానిపైకి రాళ్లు రువ్వారు. దీంతో కార్యాలయం అద్దాలు ధ్వంసమయ్యాయి. పక్కనే ఉన్న మరో దుకాణం అద్దాలు సైతం పగిలాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అక్కడినుంచి తరిమివేశారు. విహెచ్‌పి కార్యాలయంపై దాడికి నిరసనగా భజరంగ్‌దళ్, విహెచ్‌పి కార్యకర్తలు సాయంత్రం కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. అనంతరం ర్యాలీగా వెళ్తుండగా మరోవర్గం వారు ఓ ప్రార్థనాలయం నుంచి రాళ్లురువ్వారు. దీంతో కొద్దిసేపు ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి లాఠీచార్జి జరిపి ఇరువర్గాలను తరిమికొట్టారు.

About Me

Powered by Blogger.

Blog Archive

Contact us

Name

Email *

Message *

Top Ad unit 728 × 90

Disqus Shortname

Comments system

Ad Inside Post

వార్తా - హైందవం

News

Contact Form

Name

Email *

Message *

Purchasing Code

Home PageNav

PageNav Posts Number

Scroll Animation

Boxed Style