Our amazing new site will launch in

Saturday, 19 April 2014

రాముడు ఈ దేశపు ఆత్మ - అయోధ్యలో భవ్య మందిరం నిర్మించి తీరుతాం : విహెచ్పి నేత చంపత్ రాయ్


శ్రీ రాముడు ఈ దేశపు ఆత్మ, జాతీ గౌరవ చిహ్నం, అయోధ్యలో భవ్య శ్రీ రామ మందిరం నిర్మాణం అంటే అది భారత జాతి ఆత్మగౌరవ ప్రతీక, ఇస్లాం దురాక్రమణ దారుల చిహ్నాలు హిందూ దేశంలో ఉండడానికి వీల్లేదు, శ్రీ రామజన్మ భూమి లో భవ్య రామ మందిరం నిర్మించి తీరుతాం - 
శ్రీ చంపాథ్ రాయ్ విహిప అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి    
17/04/2014, భాగ్యనగర్ : హనుమాన్ జయంతి సందర్భంగా భజరంగ్ దళ్ నిర్వహించిన శ్రీ వీర్ హనుమాన్ విజయ యాత్ర ముంగిపు సభ 15/04/2014 రోజు సాయత్రం సికింద్రాబాద్ లోని ఇంపీరియల్ గార్డెన్స్ మైదానం లో జరిగింది. దాదపు 70,000 మంది యువ భజరంగ్ దళ్ కార్యకర్తలు ఈ సభ కు హాజరయ్యారు. మాన్య శ్రీ చంపాథ్ రాయ్ విశ్వ హిందూ పరిషద్ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి ముఖ్య వక్తగా హాజరయ్యరు.

భజరంగ్ దళ్ కార్యకర్తలకు మాన్య శ్రీ చంపత్ రాయ్ మార్గదర్శనం చేస్తూ " పిరికివాళ్ళ దేవుళ్ళు కూడా పిరికివాళ్ళే అయి ఉంటారన్న వీర సావర్కర్ సూక్తిని గుర్తుచేసుకోవాలి, హిందూ సమాజం పిరికి అయ్యిన కారణంగా మర్యాదా పురుషోత్తముడు శ్రీ రామున్ని పిరికివాణ్ణి చేసింది, అప్పుడే శ్రీ రామ మందిరం ద్వంసం అయి ' బాబ్రీ మస్జిద్ ' అయ్యింది, 1992 డిసెంబర్ 6 న హిందూ సమాజం లో శక్తి జాగృతం అయ్యింది తిరిగి శ్రీ రాముడు శక్తి శక్తివంతం అయ్యాడు తన పై ఉన్న దురాక్రమణ చిహ్నాన్ని తునాతుకలు హిందూ సమాజ సంఘటిత శక్తి ద్వారా చేయించాడు, దేశ ఉన్నతికి పనిచేస్తున్న ఈ యువ భజరంగిలలో నాకు ఆ రాముని ధీరోదాత్తరూపం కనిపిస్తుంది, శ్రీ రాముడు ఈ దేశపు ఆత్మ, భారత జాతి ఆత్మ గౌరవ చిహ్నం, శ్రీ రామ జన్మభూమి పవిత్ర నగరం అయోధ్యలో భవ్య శ్రీ రామ మందిరాన్ని నిర్మించడం అంటే అట్టడుగున ఉన్న దేశ స్వాభిమానాన్ని తిరిగి నిలబెట్టడమే, భారత మాతన తిరిగి విశ్వ గురువు స్థానం లో నిలపడమే అవుతుంది, ఆంగ్లేయులు ఈ దేశాన్ని వదలి పోయిన తర్వాత వారి చిహ్నాలను ఈ దేశం నుండి తొలగించాం, మౌంట్ బాటన్ రోడ్డు రాష్ట్ర పాటి రోడ్డు అయ్యింది, మరి వారి కంటే ముందు మన దేశం పై దురాక్రమణ చేసిన మొఘల్ పాలకుల బానిస చిహ్నాలను మనం ఇంకా మన మాతృభూమి పై ఉండనిద్దమా ? ఇదీ మన ఆత్మ గౌరవాన్ని కించపరిచే అంశం కాదా ? ఇస్లాం దురాక్రమణ దారుల బానిస చిహ్నాలు హిందూ దేశంలో ఉండనికి వీల్లేదు, అయోధ్య శ్రీ రామ జన్మ భూమిలో భవ్య శ్రీ రామ మందిరాన్ని నిర్మించి తీరుతాం, ప్రజాస్వామ్య భారత దేశంలో మన చేతిలో ఉన్న పాశుపతాస్త్రం ' ఓటు ' ఆ హక్కు ద్వారా ఈ దేశ పార్లమెంట్ లో ప్రత్యేక బిల్లు ద్వారా శ్రీ రామ మందిరాన్ని నిర్మించడానికి వీలుగా 300 పైగా రామ భక్తులను పార్లమెంట్ కు పంపాల్సిన ఆవశ్యకత ఉంది, ఆ దిశలో ఈ కొన్ని రోజులు మన సర్వ శక్తులు కేంద్రీకరించి పని చేస్తారని ఆశిస్తున్నాను"  అని అన్నారు.

మాన్య శ్రీ చంపాథ్ రాయ్ గారి ప్రసంగం సభికులలో నూతన ఉత్సహాన్ని నింపింది, మండుటెండలో దాదాపు 6 గంటల పాటు 15 కిమీ యాత్ర చేసి అలసిపోయిన శరీరాలుతిరిగి శ్రీ రాముని కార్యంలో అంకితమయ్యి నూతనత్వాన్ని కనబరిచాయి.
ఈ కార్యక్రమంలో వేదిక పై మాన్య శ్రీ రాఘవులు గారు విహెచ్పి అంతర్జాతీయ కార్యదర్శి, శ్రీ రామ రాజు గారు, ప్రాంత అధ్యక్షులు, శ్రీ గాళ్ రెడ్డి గారు, ప్రాంత కార్యదర్శి తదితరులు ఉన్నారు.   

No comments:

Post a Comment

About Me

Powered by Blogger.

Blog Archive

Contact us

Name

Email *

Message *

Top Ad unit 728 × 90

Disqus Shortname

Comments system

Ad Inside Post

వార్తా - హైందవం

News

Contact Form

Name

Email *

Message *

Purchasing Code

Home PageNav

PageNav Posts Number

Scroll Animation

Boxed Style