కర్నూల్ , 04/03/2014 : హిందువులు కలియుగ వైకుఠం లా భావించే పవిత్ర వెంకటేశ్వర స్వామి ఆలయం తిరుపతిలోని హిందువుల మనోభావాలను అగౌరవ పరుస్తూ చెప్పులతో దాదాపు గర్భాలయం దగ్గరగా ఉన్న వైకుఠం కాంప్లెక్స్ వరకు చెప్పులతో వెళ్ళిన వైఎస్ జగన్ మోహన్ వెంటనే హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ భజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషద్ ధర్నా చేసాయి.
ఈ సందర్భంలో విశ్వ హిందూ పరిషద్ సహా కార్యదర్శి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ' వైఎస్ జగన్ హిందువులను అవమాన పర్చే ఉద్ద్యేశంతోనే తిరుమల పర్యటన చేసినట్లు అనిపిస్తుంది, ఇక పై ఇలాంటి సంఘటనలను సహించేది లేదు, అన్య మతావలంబీకులు డిక్లరేషన్ పై సంతకం చేయకుండా ఆలయ ప్రవేశం చేయకూడదు, జగన్ ఈ నియమాన్ని కూడా ఉల్లంగించాడు, దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెంటనే ప్రకటన చేయాలి, ఈ సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ వెంటనే హిందువులందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేకుంటే తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాను ' అని అన్నారు


